విప్లవం కోసం ప్రాణాలర్పించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవ రావుకు రెడ్ సెల్యూట్ (లాల్ సలాం)
డజన్ల కొద్దీ మావోయిస్టు పార్టీ కార్యకర్తలను, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఈ నెల 21న ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా సీపీఐ (మావోయిస్ట్) కార్యదర్శి మరణాన్ని ప్రకటించారు. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని అబుజామడ్ లోని దట్టమైన అడవులలో భద్రతా దళాలతో
సుదీర్ఘ కాల్పుల తర్వాత 27 మంది మావోయిస్టు కార్యకర్తలు మరణించారు.
కామ్రేడ్ బసవరాజ్ (నంబాలకేశవరావు ) 2018 నుండి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2001 నుండి సీపీఐ (ఎం-ఎల్) పీపుల్స్ వార్ సెంట్రల్ మిలిటరీ కమిటీకి ఆయన అధిపతిగా ఉన్నారు. ఆ తర్వాత సీపీఐ (ఎం-ఎల్) పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ లు కలిసి 2004లో సీపీఐ (మావోయిస్ట్)ను ఏర్పాటు చేసినప్పుడు ఆయన అదే బాధ్యతల్లో కొనసాగించారు.
1973లో ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పటి నుండి, భారతీయ ప్రజలు, యువత, దేశ ప్రజల హక్కుల కోసం పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. అతను అజ్ఞాతంలోకి వెళ్లి, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు. అనేక సార్లు శతృవు చేతి నుండి తృటిలో తప్పించుకున్నాడు.
గతంలో అనేక సార్లు, CPI (మావోయిస్ట్) ప్రభుత్వంతో కాల్పుల విరమణ, శాంతి చర్చలకు పిలుపునిచ్చింది. కానీ దానిని ప్రభుత్వం తిరస్కరించింది. మరోవైపు, భారత రాజ్యం మావోయిస్టులపై సాయుధ దాడులను విపరీతంగా పెంచింది. ఒకవైపు మీడియాలో శాంతి కోసం మొసలి కన్నీరు కారుస్తూ, మరోవైపు ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాలలో సంకల్ప్ వంటి ఆపరేషన్ల ద్వారా మావోయిస్టులను ఊచకోత కోస్తున్నారు. అదే సమయంలో, ప్రజలు ఆకలితో, క్రూరమైన వివక్షను అనుభవిస్తున్నప్పుడు, కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపిస్తున్న CPI (మార్క్సిస్ట్) సంస్కరణవాదులు మోడీ ప్రభుత్వానికి సహాయ హస్తం అందిస్తున్నారు. ఈ సంవత్సరం వారు కేరళలో పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రకటించారు.
72 సంవత్సరాల వయసులో కామ్రేడ్ బసవ్ రాజ్ మరణించారు. ఆయన మరణం భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాలకు తీరని లోటు. గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ(ఎం-ఎల్) ఫాసిస్ట్ భారత రాజ్యం చేపట్టిన మావోయిస్టు గెరిల్లాల వేటను ఖండిస్తుంది. బడా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం సాగుతున్న ఈ హత్యాకాండను ఖండిస్తుంది. దోపిడీ, అణచివేత, వివక్షత లేని సమాజం కోసం, స్వేచ్ఛాయుత సోషలిస్ట్ సమాజం కోసం కామ్రేడ్ బసవ రాజ్ దారిలో తమ జీవితాలను అంకితం చేసి పోరాడుతున్న భారతీయ విప్లవకారులతో మేము సంఘీభావంగా నిలుస్తాము. మావోయిస్టు పార్టీకి, ఆ పార్టీ సహచరులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. పార్టీ, కార్యకర్తలు, భారత ప్రజలు తమ న్యాయమైన విప్లవోద్యమాన్ని కొనసాగిస్తారని మేము విశ్వసిస్తున్నాము.
22/5/2025
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ గ్రీస్ (ఎం-ఎల్) పొలిటికల్