కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వెంటనే సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి! ఆపరేషన్ కగార్ ను ఆపి, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి!
సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ డిమాండ్!
ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న నరమేధాన్ని సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ హత్యాకాండలో మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీలు దాదాపు 400 మంది ఈ సంవత్సరమే చనిపోయారు. ఆరెస్సెస్-బిజెపి నాయకత్వాన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో వున్న చట్టాల నిబంధనలు కానీ, సాయుధ ఘర్షణలకు సంబంధించిన నియమాలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా, మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రాంతంలో నివశిస్తున్న ఆదివాసులను గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, నిరంకుశంగా వారిని కూడా హతమారుస్తోంది.
ఛత్తీస్గడ్, తెలంగాణా సరిహద్దులలో వున్న కర్రెగుట్ట కొండల్ని పారా మిలటరీ బలగాలతో చుట్టివేయటం పట్ల సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వున్నట్లుగా తెలుస్తున్న మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలను చంపే లక్ష్యంగా భారీ స్థాయిలో సాయుధ బలగాలను కేంద్రీకరించుట జరిగింది. ఈ ప్రాంతంలోని మావోయిస్టు పార్టీ నాయకులను నిర్మూలించటానికి ఏప్రిల్ 21 నుండి భద్రతా బలగాల దాడిని ప్రారంభించింది.
సి.పి.ఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ శాంతి చర్చలకు తమ సంసిద్ధతను తెలియజేస్తూ చేసిన ప్రకటనను సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ఆహ్వానిస్తున్నది. ఏప్రిల్ 24న కూడా తిరిగి ఇదే విధమైన ప్రకటనను పునరుద్ఘాటించటం జరిగింది. సి.పి.ఐ (మావోయిస్టు) నాయకులు కాల్పుల విరమణను కూడా ఏకపక్షంగా ప్రకటించారు. శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం సానుకూలంగానూ, నిర్ధిష్టంగానూ స్పందించకపోవుట యెడల సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన స్థానంలో ప్రభుత్వం షరతులు పెడుతోంది. ఇది ఈ ప్రాంతంలో ప్రభుత్వం కోరుతున్న శాంతిలోని డొల్లతనాన్ని తెలియచేస్తోంది.
సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్లు :
- సాయుధ చర్యలు లేకుండా చేయటానికి సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ నిర్ణయానికి ప్రతిస్పందనగా ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలి.
- ప్రభుత్వం సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు వెంటనే మొదలు పెట్టాలి.
- ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలి. సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసులను నిర్మూలించే హత్యాకాండను ఆపాలి.
ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలకు సంబంధించిన అనేక సమస్యలు వున్నాయి. అయితే, పై డిమాండ్లను వెంటనే చేయాల్సిన అవసరం వుంది.
తక్షణమే కాల్పుల విరమణ, బేషరుతుగా శాంతి చర్చలు డిమాండ్ చేయటానికి అన్ని ప్రజాస్వామిక సంస్థలు,వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యం కావాలని సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.ప్రభుత్వం గుర్తించేటట్లుగా చేసి, రాజ్యాంగబద్దమైన, చట్టబద్దమైన నిబంధనలు అనుసరించేటట్లుగా చేయుటలో వివిధ తరగతులు, శక్తులు భాగస్వాములయ్యే విశాల ఉద్యమం ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. కమ్యూనిస్టు విప్లవకారులను భౌతికంగా నిర్మూలించే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యతిరేకించే పాలకవర్గ పార్టీలు కూడా కాల్పుల విరమణ, బేషరుతు చర్చలను డిమాండ్ చేయటానికి ముందుకు రావాలి. శాంతి చర్చలు, చుట్టివేతతో సహా, ప్రస్తుత ప్రతిష్టంభనకు శాంతియుత పరిష్కారం కొరకు తమ వాణిని వినిపించవలసిందిగా ప్రజాస్వామిక, శాంతి, సామాజిక న్యాయం కోరే శక్తులన్నింటికీ సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
యతీంద్ర కుమార్
కార్యదర్శి
కేంద్ర కమిటీ
సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ
30-04-2025