Menu

దండకారణ్యంలో ప్రభుత్వ మారణకాండకు వ్యతిరేకంగా పంజాబ్ వ్యాప్త యాత్ర… భగత్ సింగ్ పూర్వీకుల ఇంటి నుండి ప్రారంభం

anadmin 3 months ago 0 167

దండకారణ్యంలో ప్రభుత్వ మారణకాండకు వ్యతిరేకంగా పంజాబ్ వ్యాప్త ప్రచార యాత్ర… భగత్ సింగ్ పూర్వీకుల ఇంటి నుండి ప్రారంభం

ఆదివాసులపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ప్రముఖ హక్కుల కార్యకర్త హిమాంశు కుమార్ పంజాబ్ పర్యటన మార్చి 22 నుండి షహీద్ భగత్ సింగ్ పూర్వీకుల ఇంటి నుండి ప్రారంభమవుతుంది.
పంజాబ్ అంతటా అణచివేత వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
మద్దతు కోసం డెమోక్రటిక్ ఫ్రంట్ విజ్ఞప్తి చేసింది.

ప్రఖ్యాత చింతకుడు, రచయిత, ప్రజాస్వామిక హక్కుల న్యాయవాది హిమాంశు కుమార్ మార్చి 22 సాయంత్రం 7 గంటలకు షహీద్ భగత్ సింగ్ స్వస్థలమైన ఖట్కర్ కలాన్ నుండి పంజాబ్ పర్యటనను ప్రారంభిస్తారని ఆపరేషన్ గ్రీన్ హంట్ వ్యతిరేక డెమోక్రటిక్ ఫ్రంట్ (పంజాబ్) ప్రకటించింది.
ఈ ప్రత్యేక యాత్ర భగత్ సింగ్ ఇంటి నుండి ప్రారంభమై, నిజమైన స్వేచ్ఛ, సమానత్వాల ఆధారంగా ఒక వ్యవస్థను స్థాపించే లక్ష్యంతో సామ్రాజ్యవాద, దేశీయ దోపిడీకి వ్యతిరేకంగా స్వరాన్నెత్తుతుంది.

ఈ యాత్ర ఆదివాసులు, రాజకీయ కార్యకర్తలపై ప్రభుత్వం సాగిస్తున్న‌ మారణహోమానికి వ్యతిరేకంగా దృఢమైన ప్రచారం చేస్తుంది; భారత పాలకవర్గం అమలుచేస్తున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక నమూనాను వ్యతిరేకించాలని పంజాబ్‌లోని పోరాడుతున్న ప్రజలకు పిలుపునిస్తుంది.

ఈ కేంపెయిన్ ఆదివాసుల హత్యలు, నిర్వాసిత్వం, రాజ్య ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరిస్తుంది.

యాత్ర ప్రారంభమైన తర్వాత, మార్చి 22 సాయంత్రం షహీద్ భగత్ సింగ్, అతని సహచరుల జ్ఞాపకార్థం షహీద్ స్మారక్ సమితి, బంగా నిర్వహించే వార్షిక కార్యక్రమంలో హిమాంశు కుమార్ ప్రసంగిస్తారు.

దీని తరువాత యాత్ర విప్లవ కవి షహీద్ పాష్ స్వస్థలమైన తల్వండి సలేం వైపు సాగుతుంది.

మార్చి 23న ఉదయం 11 గంటలకు, పాష్ హన్స్‌రాజ్ షహీద్ స్మారక సమితి (నకోదర్ ప్రాంతం) నిర్వహించే వార్షిక నివాళి కార్యక్రమంలో హిమాంశు కుమార్ ప్రసంగిస్తారు, దీనిలో షహీద్ పాష్, హన్స్‌రాజ్, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు నివాళులు అర్పిస్తారు.

ఈ యాత్రలోని ఇతర ప్రధాన మజిలీలు:

మార్చి 25: జలియన్ వాలాబాగ్, అమృత్‌సర్

మార్చి 28: భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ అమరవీరులైన హుస్సేనివాలా

మార్చి 30: హోషియార్‌పూర్

మార్చి 31: పాటియాలా

ఏప్రిల్ 5: తార్క్షిల్ భవన్, బర్నాలా

ఏప్రిల్ 6: దేశభక్త్ మెమోరియల్ హాల్, జలంధర్ (గదర్ తదితర విప్లవకర ఉద్యమాల వారసత్వానికి అంకితం)

ఏప్రిల్ 7: పంజాబీ భవన్, లూధియానా

ఏప్రిల్ 8: బటిండాలోని టీచర్స్ హోమ్‌లో ‘నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రక దినోత్సవం’ కార్యక్రమం.

దీనితో పాటు, చండీగఢ్ తదితర ప్రదేశాలలో చర్చలు, సమావేశాలు కూడా నిర్వహించాలని అనుకున్నాం.
ప్రజాస్వామిక, తార్కిక, సాహిత్య-సాంస్కృతిక సంస్థలు, ప్రజాపక్ష మేధావులు, న్యాయ ప్రేమికుల మద్దతుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో హిమాంశు కుమార్ తన అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటారు.
ఈ యాత్ర ద్వారా, స్వదేశీ, విదేశీ కార్పొరేట్ ప్రాజెక్టుల పేరుతో నీరు, అడవులు, భూమిని ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఫాసిస్ట్ దాడులను ఆయన బహిర్గతం చేస్తారు; దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతారు.

పంజాబ్ ప్రజలకు డెమోక్రటిక్ ఫ్రంట్ విజ్ఞప్తి:
హిమాంశు కుమార్ పర్యటన సందర్భంగా నిర్వహించే బహిరంగ సమావేశాలు, సమావేశాలు, చర్చలలో పంజాబ్‌లోని అన్ని ప్రగతిశీల, హేతువాద, ప్రజాస్వామిక, విప్లవకర శక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాటిని అర్థవంతంగా, సమగ్రంగా, విజయవంతం చేయాలని డెమోక్రటిక్ ఫ్రంట్ పిలుపునిస్తూంది.

జారీ చేసినవారు:
డాక్టర్ పర్మిందర్: 95010 25030
ప్రో. ఎ.కె. మలేరియా: 98557 00310
బూటా సింగ్ మహిమూద్‌పూర్: 94634 74342
యశ్‌పాల్: 98145 35005

(తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad