సీపీఐ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎన్ కౌంటర్ లో మరణించినట్టు వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. మావోయిస్టు పార్టీ నాయకురాలు గంగ పేరుతో విడుదల చేసిన ప్రకటన నకిలీదని, ఆ ప్రకటనను పోలీసులే సృష్టించారని మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి సోమతేర్ సమత స్పష్టం చేశారు.
సమత విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం…
2025, జనవరి 16-17 తేదీలలో 8000 మంది పోలీసు బలగాలు బీజాపూర్ జిల్లాలోని సింగవరం, తుండెపల్లి, మల్లంపెంట, పూజారి కాంకేర్, తేమల్బట్టి గ్రామాల ప్రజలపై పిరికిపందల్లాగా దాడులలు చేశారు. వాటిని మేం తిప్పికొట్టాం.
ఈ పిరికి దాడుల్లో నలుగురు గ్రామస్తులు చనిపోయారు. అనేకమంది ప్రజలు గాయపడ్డారు. వారికి వైద్యం చేయడానికి వెళ్ళిన నిరాయుధులైన మా మెడికల్ టీం ను పట్టుకొని చిత్రహింసలపాలు చేసి ప్రజలముందే అత్యాచారం చేసి చంపేశారు. సహచరులందరికీ నివాళులర్పిస్తున్నాం. వారి అసంపూర్ణ లక్ష్యాలను పూర్తి చేస్తాము. ప్రజల్లో అయోమయం, నైరాశ్యం సృష్టించేందుకు పోలీసులు మా పార్టీ పేరుతో దామోదర్ తో సహా పలువురు కామ్రేడ్స్ మరణించారని ఫేక్ స్టేట్మెంట్లు ఇచ్చారు. మా సహచరులు దామోదర్, ఇతర సహచరులు క్షేమంగా ఉన్నారు.
ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి.
ప్రియమైన ప్రజానికానికి
బీజాపూర్ జిల్లా ఉసుర్ బ్లాక్ పరిధిలోని సింగవరం, తుమీ పల్లి, మల్లెం పెంట, పూజారి కంకేర్, తేమల బట్టి గ్రామాల వద్ద జనవరి 16-17 తేదీల్లో 8000 మంది పోలీసు డిఆర్, బస్తర్ ఫైటర్స్, సీఆర్ పీఎఫ్, కోబ్రా కమాండో బలగాలు, భారత సైన్యానికి చెందిన కొన్ని బలగాలతో ప్రజలపై దాడి చేశారు. ఇందులో నలుగురు గ్రామస్తులు హత్యకు గురయ్యారు. ప్రజలకు వైద్యం అందించేందుకు వెళ్లిన మన సహచరులను నిరాయుధులుగా పట్టుకుని, ప్రజల ముందు చిత్రహింసలకు గురిచేసి, దారుణంగా హత్య చేశారు. ఇది ‘కగార్’ పేరుతో గిరిజనులపై సాగుతున్న యుద్ధం. ముఖ్యమంత్రి, పోలీసు మంత్రి, పోలీసు అధికారులు ఈ పిరికిపంద చర్యను మెచ్చుకోవడం ద్వారా తమ ఫాసిస్టు ముఖాన్నిబయటపెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో వేలాది మంది ప్రజలు ఈ పిరికిపంద చర్యను నిరసిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజలను అణిచివేసేందుకు ఏకకాలంలో నలుగురు గ్రామస్తులను హత్య చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్రజల గృహోపకరణాలు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళు, మిల్లులు, కుట్టు మిషన్లు, వడ్లు, బియ్యం , బట్టలు మొదలైనవవాటిని ధ్వంసం చేశారు.
మానవహననం పూర్తయిన తర్వాత, మృతదేహాలను బలవంతంగా పట్టుకుని బాసగూడకు తరలించారు. గ్రామాలకు చెందిన వందలాది మందిని పట్టుకుని తమ వెంట తీసుకెళ్లారు. ఆ వ్యక్తుల ఆచూకి ఇంకా తెలియరాలేదు. ఇందులో కొంత మందిని లొంగిపోయారని ప్రకటించే అవకాశం ఉంది. రివార్డు నక్సలైట్ పేరుతో మరి కొందరిని చంపే అవకాశం ఉంది. సైకలాజికల్ ప్రాడ్ ప్రచార యుద్ధంలో భాగంగా, పోలీసు మంత్రి విజయ్ శర్మ , కొంతమంది దుర్మార్గులైన, అబద్ధాలు చెప్పడం, ప్రచారం చేయడంలో దిట్ట అయిన పోలీసు అధికారులు కలిసి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మా సహచరులు దామోదర్ మరియు ఇతర సహచరులు చనిపోయారని నకిలీ స్టేట్మెంట్ ఇచ్చారు.మా సహచరులు దామోదర్ , ఇతర సహచరులు క్షేమంగా ఉన్నారు.
భద్రతా దళాల యొక్క ఈ ప్రధాన ఆపరేషన్లు మన PLGA దళాల ధైర్య ప్రతిఘటనతో విఫలమయ్యాయి. PLGA దళం పోలీసులతో ఒకే రోజు 6 సార్లు ఘర్షణ పడింది. 6 మంది పోలీసులు మరణించగా, 8 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ పోరాటంలో, మా కామ్రేడ్లలో ఒకరు ఉయితే ఆయతు (పీఎం, మెసిగూడ నివాసి) వీరమరణం పొందారు. ఆ కాల్పుల్లో గాయపడిన కామ్రేడ్ మడ్యం లచ్చి (పీఎం, తిమ్మార్ నివాసి) పోలీసులకు చిక్కి చంపబడ్డాడు.
పోలీసులు పట్టుకుని చంపిన వ్యక్తుల పేర్లు:
బట్టి (సింగవరం), సోడి భీమా (సింగవరం). సోడి రామ్ (సింగవరం), పొడియం దేవా (సింగవరం), మడకం
మడ్కం జోగి (ఏసీఎం) సౌత్ బస్తర్ డివిజన్ వైద్య బృందం, (టోంగ్ గూడ నివాసి) ప్రజలకు చికిత్స అందించేందుకు తుండెపల్లి గ్రామానికి వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకుని, చిత్రహింసలు పెట్టి, గొంతు కోసి చంపారు, తున్దేపల్లి గ్రామంలో మడావి దేవే (పీపీసీఎం, కుంట ఏరియా నివాసి, కొత్త నేంద్ర), నుప్పో సొమి (పీఎం, పోలెంపల్లి నివాసి), దొడ్డి వాసు (పీఎం, నివాసి), గెల్లూరు), మడకం (పీఎం, పువ్వార్ నివాసి), సింగవరం గ్రామ సమీపంలో పూనెం మంగలి (సీఎం, దువల నేంద్ర నివాసి) హత్యకు గురయ్యారు.
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ మా పార్టీని అంతమొందించే పథకంలో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా మారణకాండకు పాల్పడుతున్నాయి. నీరు, అడవి, భూమి, అస్తిత్వం, గుర్తింపు, హక్కుల కోసం మధ్య భారతంలో జరుగుతున్న ఉద్యమానికి మా పార్టీ నాయకత్వం వహిస్తోంది. బీజేపీ కార్పోరేట్ కంపెనీలకు నంబర్ వన్ సేవకుడిగా మారి సహజ వనరులను, ప్రజా ఆస్తులను ఆ కార్పొరేట్లకు అప్పగించి మన పార్టీని అంతమొందించేందుకు ‘కగార్’ వార్ కు పాల్పడుతున్నది.
ఇందులో సామాన్య ప్రజానీకం, మా పార్టీ కార్యకర్తలు చనిపోతున్నారు. ఈ యుద్దంలో బీజేపీ దుర్మార్గులైన పోలీసు అధికారులను ఉపయోగించుకుంటోంది. కంటిన్యూ ఆపరేషన్ల పేరుతో సామాన్యుల ప్రాణాలకు తెగించి రివార్డులు ప్రకటిస్తూ కోట్లాది రూపాయలను జేబులో వేసుకుంటున్నారు.
ఆ విధంగా బిజెపి ఒక దేశం, ఒకే పార్టీ,ఒకే ఎన్నిక (బ్రాహ్మణ హిందూత్వ ఫాసిజం) ఒకే భాష, ఒకే సంస్కృతి (వర్ణ సంస్కృతి), కామన్ సివిల్ కోడ్, వికాస్ భారత్ (కార్పొరేట్ ఇండియా) వంటి పథకాలను ప్రోత్సహిస్తున్నారు. రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, మేధావులు, పాత్రికేయులు, రచయితలు, కళాకారులు, అన్ని రకాల ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కార్పొరేటీకరణ, సైనికీకరణ వంటి ఉగ్రవాద ప్రణాళికల ద్వారా అందరినీ అంతమొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకే మావోయిస్టులకే కాదు యావత్ భారతదేశ ప్రజలకు బీజేపీ పెద్ద ముప్పుగా మారింది. కాబట్టి బీజేపీని ఓడించి దేశాన్ని, సహజవనరులను, ప్రజా ఆస్తులను, పర్యావరణాన్ని, సంస్కృతిని కాపాడేందుకు ఐక్యంగా పోరాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.
ఆదివాసీ సంఘాలు, జర్నలిస్టులు, మేధావులు, ప్రతిపక్ష పార్టీలు ఈ మారణకాండపై విచారణ జరిపి నిజానిజాలను దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని, నేరస్థులపై చట్టపరమైన చర్యల కోసం ఉద్యమించాలని కోరుతున్నాం.
జనవరి 16-17 తేదీలలో ఉసుర్ బ్లాక్ గ్రామాలపై దాడి చేసి పోలీసులు సృష్టించిన మారణకాండను తీవ్రంగా ఖండించండి. స్వతంత్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి.
నంబర్ వన్ ద్రోహి, తీవ్రవాద, కార్పొరేట్ భక్త ఫాసిస్ట్ బీజేపీని ఓడించండి.
కార్పొరేటీకరణ-సైనికీకరణ, ‘కగార్’ పోరుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయండి.భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) వర్ధిల్లాలి.
విప్లవాభినందనలతో
సోమతేర్ సమత
ప్రతినిధి
సౌత్ సబ్ జోనల్ బ్యూరో
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)