2024 నవంబర్ 24 నాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు నిరసనకారులపై ప్రయోగించిన హింస మొదట్లో ముగ్గురు ముస్లిం యువకుల హత్యకు దారితీసింది. సంభాల్ నుండి వెలువడిన ఒక వీడియోలో, పౌరులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తరువాత, పోలీసు కాల్పుల కారణంగా మరణించిన వారి సంఖ్య అయిదుకి పెరిగింది; వారందరూ ముస్లిం సముదాయానికి చెందినవారే; కైఫ్ (17), అయాన్ (18), నయీమ్ (28), నోమన్ (42), బిలాల్ అన్సారీ (25).
మైనారిటీ మత సముదాయంపైన మతపరమైన దాడిచేయడానికి, అవమానపరిచేందుకు “జై శ్రీరాం” అని నినాదాలు చేస్తూన్న హిందుత్వ గూండాల గుంపుతో కలిసి షాహి జామా మసీదును సర్వే చేయడానికి కోర్టు నియమించిన బృందం వచ్చినప్పుడు, స్థానిక ముస్లిం జనాభా తమ నిరసనను తెలియచేసినపుడు ఈ ఘటన జరిగింది.
హరి హరి అనే హిందూ దేవాలయంపైన షాహి జామా మసీదును నిర్మించారని విష్ణు జైన్ పిటిషన్ వేయడంతో సంభాల్లోని జిల్లా కోర్టు మసీదును సర్వే చేయమని ఆదేశించింది. ఒక న్యాయస్థానం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తుల సాధనంగా బహిరంగంగా వ్యవహరించడం, అసంబద్ధమైన పిటిషన్లను స్వీకరించడం, ఇతర పక్షాలు అంటే షాహీ జామా మసీదు సంరక్షకులు లేదా స్థానిక ముస్లిం జనాభా వాదన వినకుండా సర్వేలకు ఆదేశించడం చాలా ఆందోళనకరమైన విషయం. ఇప్పటికే చట్టవిరుద్ధమైన సర్వేచేయాలనే ఆదేశం వల్ల బాధపడుతున్న స్థానిక ముస్లిం మైనారిటీల మనోభావాలను దెబ్బతీసేలా మతపరమైన నినాదాలు చేస్తూ హిందుత్వ గూండాలతో కోర్టు నియమించిన సర్వే బృందం మసీదు వరకు వెళ్లడం మరింత ఆందోళనను కలిగిస్తోంది.
న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక, పోలీసు యంత్రాంగం వంటి వ్యవస్థలలో పెరుగుతున్న కాషాయీకరణ విభ్రాంతికరమైన నమూనాను సర్వే బృందం వచ్చే వరకు జరిగిన ఈ మొత్తం ఘటనాక్రమం; నిరసనకారులపై పోలీసులు ఉపయోగించిన క్రూరమైన అణచివేత పద్ధతి తెలియచేస్తుంది. బాధిత మైనారిటీ సముదాయం తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి నిరసనలు చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.
నిరసనలను ఘర్షణలుగా కాకుండా, రాష్ట్ర అధికారులు ఉద్దేశపూర్వకంగా పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నట్లుగా చూడాలి. అంతేకాకుండా, హింసకు కారణమైన హిందుత్వవాద శక్తులను నిందించడానికి బదులు, అన్ని సామాజిక, ప్రజాస్వామిక సంస్థలు, వ్యక్తులను సంబల్లోకి ప్రవేశించకుండా నిరోధించే ఉత్తర్వులను జారీ చేయడం ద్వారా జిల్లా పరిపాలన ఈ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది.
రాజ్యం చేసే అత్యాచారాలు బహిర్గతం కాకుండా ఉపయోగిస్తున్న, మేవాత్ ఘటనలో నుహ్ పాలనా యంత్రాంగమూ, మణిపూర్లో, బస్తర్లో, ఆయా ప్రాంతాలకు వెళ్ళే నిజనిర్ధారణ బృందాలను అడ్డుకోవడమనే ఈ ఎత్తుగడ మరింత ఆందోళనను కలిగిస్తోంది.
తమ మతాన్ని ఆచరించే, బోధించే హక్కులపై జరిగిన ఈ దాడి; ప్రాథమిక హక్కులైన సమావేశమయ్యే, వ్యక్తీకరణ స్వేచ్ఛలపై దాడి, ఫాసిస్టు పాలకవర్గ భావజాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి, మైనారిటీల ప్రజాస్వామ్య హక్కులను, అవకాశాల్ని తగ్గించడానికి రాజ్యం, దాని యంత్రాంగం ఎలా ఒక సాధనంగా మారుతున్నాయో దీనికి ఉదాహరణగా చూడాలి.
సమాజంలో దోపిడీకి గురవుతున్న వర్గాలకు చెందిన మైనారిటీలపై జరిగిన ఈ దాడి రాజ్య ఎజెండాలో భాగం; రాజ్యాంగ వ్యతిరేక, వివక్షత కలిగిన హిందూత్వ రాష్ట్రాన్ని స్థాపించే తన ఆదేశాన్ని అమలు చేయడానికి రాజ్యం పోలీసు బలగాలను తన వ్యక్తిగత సైన్యంగా ఉపయోగిస్తుంది. ప్రజలకు ప్రజాస్వామిక అవకాశం లేదా ప్రాథమిక హక్కులు వుండవు; ఫాసిస్ట్ శక్తులకు అనుకూలంగా “చట్ట పాలన” అమలుజరుగుతుందని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.
అయిదుగురు ముస్లిం యువకుల అనాగరిక హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.
మా డిమాండ్లు:
- అయిదుగురు యువకుల చట్టాతీత హత్యలకు బాధ్యులైన పోలీసు సిబ్బంది/అధికారుల జవాబుదారీతనాన్ని నిర్ణయించాలి.
- చట్టవిరుద్ధమైన, మతపర ప్రేరిత షాహి జామా మసీదు సర్వేను రద్దు చేయాలి.
- స్థానిక వాతావరణాన్ని మతపర విభజన చేసి ప్రశాంతతకు విఘాతం కలిగించినందుకు హిందుత్వ గూండాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
- సంభాల్కు వెళ్ళడానికి సామాజిక, ప్రజాస్వామిక సంస్థలకు అనుమతినివ్వాలి.
రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (CASR):
ఎఐఆర్ఎస్ఒ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్, ఎపిసిఆర్, బిఎఎస్ఎఫ్, బిఎస్ఎమ్, భీమ్ ఆర్మీ, బిగుల్ మజ్దూర్ దస్తా, బిఎస్సిఇఎమ్, సిఇఎమ్, సిఆర్పిపి, సిటిఎఫ్, దిశ, డిఐఎస్ఎస్సి, డిఎస్యు, డిటిఎఫ్, ఫోరం అగైన్స్ట్ రిప్రెషన్, తెలంగాణ, ఫ్రటర్నిటీ, ఐఏపిఎల్, ఇన్నోసెన్స్ నెట్వర్క్, కర్ణాటక జనశక్తి, ఎల్ఎఎ, మజ్దూర్ అధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రిక, మోర్చా పత్రిక, ఎన్ఎపిఎమ్, ఎన్బిఎస్, నిశాంత్ నాట్య మంచ్, నౌరూజ్, ఎన్టియుఐ, పీపుల్స్ వాచ్, రిహాయి మంచ్, సమాజ్వాది జన్ పరిషద్, సమాజ్వాది లోక్ మంచ్, బహుజన్ సమాజ్వాది లోక్ మంచ్, ఎస్ఎఫ్ఐ, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్, యునైటెడ్ పీస్ అలియన్స్, డబ్ల్యూఎస్ఎస్, వై4ఎస్