Menu

లగచర్ల ప్రజల పోరాటానికి మద్దతు ప్రకటించిన మావోయిస్టు పార్టీ

anadmin 7 months ago 0 234

తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ కార్పోరేట్లకు కట్టపెట్టడానికి కుట్రలు చేస్తున్నదని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ప్రజలు ఫార్మా సిటీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించింది. మూసీ సుందరీకరణ, హైడ్రా అక్రమ కూల్చివేతలు, ఇథనాల్ ఫ్యాక్టరీలతో సర్కార్ ప్రజల జీవితాలను నాశనం చేయబూనుకున్నదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

జగన్ ప్రకటన పూర్తి పాఠం…

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం గడిచింది. సంవత్సర కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పోరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పని చేస్తుంది. పౌర ప్రాధమిక హక్కులను, జీవించే హక్కును కాల రాస్తున్నది. రాష్ట్రాన్ని కార్పోరేట్లకు కట్టపెట్టడానికి ఆర్ధిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పోరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ ను ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) చేయడానికే ప్రపంచ స్థాయి హైదరాబాద్ (గ్లోబల్ హైదరాబాద్) నిర్మించే పేరుతో మూసీ నది సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేర్లతో రివర్ బెల్ట్ డెవలప్ మెంట్పే కార్పోరేషన్ లిమిటెడ్(ఎంఆర్డిసిఎల్), కార్యచరణ విభాగం హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ప్రత్యేక విభాగాలను ఏర్పర్చి వాటికి విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారు.

మూసీ నదిని పర్యాకటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చారిత్రిక కట్టడాలను నిర్మించడానికి దేశీ, విదేశీ కార్పోరేట్ల వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వనించారు. మూసీ నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరును అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడంలేదు. పరిశ్రమల నుండి వెలువడుతున్న అనేక వ్యర్ధ పదార్థాల నుండి ఏర్పడుతున్న కాలుష్యం, మురికి నీరు మూసి నదిలో చేరుతున్నాయి. వాటి నివారణ చర్యలు చేపట్టకుండా, నీటి శుద్ధి చేయకుండా వీటిన్నింటికి కారణం కేవలం మూసి పరివాహక ప్రాంత ప్రజలనే ప్రచారం చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన బడా, బడా వ్యక్తుల, సంస్థల పెద్ద, పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం వుంటున్న మద్య తరగతి, పేద ప్రజలను ఆక్రమణ‌దారులుగా ప్రకటించారు. న్యాయ పరమైన అనుమతులు పక్కన పెట్టి, ప్రజలకు ఎలాంటి ముందుస్తు సమాచారం గాని, నోటీస్ లు గాని ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్యపూర్వకంగా, అకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి సాధారణ ప్రజలు జీవించే హక్కును హరించి వేస్తున్నారు.

వికరాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండంలో విఎల్ఎప్ (వెరీ లో ప్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్(నేవీ రాడార్) స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించింది. దామగుండంలో నేవి రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ ఫారెస్టు 2900 ఎకరాల భూమిని అప్పగించారు. దీనితో సహజ సిద్ధమైన అనంతగిరికొండలున్న రిజర్వు ఫారెస్టు ద్వంసం అవుతుంది. అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు.

కొడంగల్ నియోజవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో పార్మసిటిని నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు. భూములు కొల్పుతున్న రైతులు జీవన్మ‌రణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు. ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు బనాయించారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ప్రజోద్యమాన్ని అణిచివేయడానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయుడిని విధుల నుండి సస్పెండ్ చేశారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో విప్లవ కారులపై ఫాసిస్టు దాడులకు పూనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం దామెరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి కా.నల్లమారి అశోక్ ను, ఇదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాధపాలెం గ్రామం వద్ద ఆరుగురి విప్లవకారులను ఫాశవికంగా హత్యలు చేశారు.

నేడు రాష్ట్రంలో జరుగుతున్న విద్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనో, బాధ్యత రాహిత్యం వల్లనో జరుగుతున్నది కాదు. ఉద్ద్యేశ పూర్వకంగా కార్పోరేట్ల లాభాల కోసం కొమ్ముకాస్తూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వారి నమ్మిన బంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. వారి పెట్టుబడులలో వాటా, పెద్ద మొత్తంలో కమీషన్లు పొందుతున్నాడు.

ప్రజలారా! రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేట్ల అనుకూల, ప్రజావ్యతిరేక అప్రజాస్వామిక ఫాశవిక పాలనను ఖండించండి. అక్రమ కట్టడాలు, మూసీనది ప్రక్షాళన పేర్లతో మద్యతరగతి, పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి. పర్యావరణాన్ని విద్వంసం చేస్తున్న నేవి రాడర్ స్టేషన్ ను, పార్మాసిటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విరోచితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టండి.

జగన్,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad