Menu

జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

anadmin 11 months ago 0 235

జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపండి!

నక్సల్బరీ ప్రజా యుద్ధ బాటే- దేశ విముక్తికి మార్గమని ఎలుగెత్తి చాటండి!!

ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాతుక ఆపరేషన్ కగార్ ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడించండి!!

మన దేశంలో మహత్తర నక్సల్బరీ సాయుధ రైతాంగ తిరుగు బాటు నుండి మొదలుకొని నేటి వరకు నూతన ప్రజాస్వామిక విప్లవ కోసం దీర్ఘకాల ప్రజాయుద్ధం గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. విప్లవోద్యమ పురోగమన క్రమంలో భారత విప్లవ మార్గదర్శకులు కామ్రేడ్ చారుమజుందార్ 1972 జూలై 28న, కామ్రేడ్ కన్హాయ్ చటార్జి 1982 జూలై 18న అమరులయ్యారు. ఆ ఇద్దరు నాయకులు సాయుధ పోరాటాన్ని ప్రజా యుద్ధాన్ని దేశ రాజకీయ ఎజెండా మీదికి తెచ్చారు. ఆనాటి నుండి వారు చూపిన దీర్ఘకాలిక సాయుధ పోరాట మార్గంలో మన దేశంలో విప్లవోద్యమం పురోగమిస్తూ వస్తుంది. 50 సంవత్సరాల పురోగమన క్రమంలో కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో నుండి సాధారణ పీడిత ప్రజల వరకు వేనవేల మంది మన ప్రియతమ కామ్రేడ్స్ వీర యోధులు వీర వనితలు అనేక మంది పీడిత ప్రజలు తమ నును వెచ్చని నెత్తురు ధార పోసి ప్రాణాలు అర్పించారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి గత సంవత్సర కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక సూరజ్ కుండ్. ఆపరేషన్ కగార్ ను వీరోచితంగా ప్రతిఘటిస్తూ దేశ వ్యాప్తంగా 200 మందికి పైగా కామేడ్స్ అమరత్వం పొందారు. వీరి మహోన్నత త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయ సాధనకు పునరంకితమవడానికి జూలై 28న అమర వీరుల సంస్మ‌రణ వారాన్ని ప్రతి యేట జరుపుకుంటున్న విషయం ప్రజలందరికి తెలిసిందే. అయితే ఈ యేడు బ్రాహ్మణీయ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై అత్యంత కౄరమైన ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తున్న దాడుల మధ్య జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అత్యున్నత త్యాగాలు చేసి అసువులు బాసిన అమరులందరికి వీర యోధులకు, వీర వనితలందరికి మన పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది.

సామ్రాజ్యవాదుల, బడా కార్పోరేట్ల ప్రయోజనాల కోసం పీడిత ప్రజలను, సహజ వనరులను తమ ఇష్టానుసారంగా లూటీ చేసేందుకు మోడీ నాయత్వంలోని బీజేపి నవ భారత్, వికసిత్ భారత్ నిర్మాణం పేరుతో 2047 వరకు దేశాన్ని బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్యంగా నిర్మించే లక్ష్యంతో సామ్రాజ్యవాదుల, దళారీ పాలకుల ఎజెండాను దూకుడుగా ముందుకు తీసుకుపోతున్నది. విదేశీ పెట్టుబడులు దేశంలోకి స్వేచ్చగా చొచ్చుకొచ్చేలా నిబంధనలను సరళతరం చేసింది. మేకిన్ ఇండియా. డిజిటల్ ఇండియా ప్రచారంలో సామ్రాజ్యవాదుల పెట్టుబడులను ఆకర్శించడానికి ప్రయత్నిస్తున్నది. భారత దేశంలో గుత్త పెట్టుబడికి లాభాలు సమకూరుస్తానని సామ్రాజ్యవాదులకు మోడీ వాగ్ధానం చేశాడు. అందుకు భారత దేశంలో ఉన్న అపార వనరులను, చౌక శ్రమను, మార్కెట్ ను యధేచ్చగా కొల్లగొట్టడానికి సామ్రాజ్యవాదులతో, దళారి నిరంకుశ బడా బూర్జువాలతో అదానీ, అంబానీలతో అనేక ఒప్పందాలు చేసుకున్నారు. దేశ సంపదలను దోచుకునేలా నిబంధనలను చట్టాలను సవరిస్తున్నారు. అందులో భాగంగా వందకు పైగా చట్ట సవరణలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నీళ్ళు నిధులు, నియామకాలు, ఎన్ కౌంటర్లు లేని ప్రజాస్వామిక తెలంగాణ కొరకు దశబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు కనీసం ప్రజాస్వామిక హక్కులు కరువయ్యాయి. తెలంగాణ ప్రజలను నయ వంచనకు గురి చేసిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని ప్రజలు కూల్చివేసి బుద్ధి చెప్పారు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం అనే వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపితో చేతులు కలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భ‌ట్టి ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నరు.

భ‌ట్టి విక్రమార్క కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి మావోయిస్టులను నిర్మూలించడానికి సీఆర్పీఎఫ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కావాలని, అదనంగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ప్రజాస్వామిక బద్ధంగా పోరాడుతున్న ప్రజలపై, నిరుద్యోగులపై, ప్రశ్నిస్తున్న ప్రజాస్వామికవాదులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజలను నమ్మించడానికి ప్రజా పాలన అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సామ్రజ్యవాదులకు, దేశీయ, విదేశీ బడా కార్పోరేట్లు అదానీ, జిందాల్, గోచీ ఇండియా సంస్థ, వెబ్ వెర్క్ సంస్థలకు కొమ్ము కాస్తున్నారు.

మన దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్య నిర్మాణానికి, సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ల దళారీ పాలకుల దోపిడి విధానాలకు అడ్డంకిగా మారిన మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి అనేక పథకాలను రూపొందించారు. గత దశాబ్ద కాలానికి పైగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ని దేశ అంతరంగిక భద్రతకు పెను ప్రమాదంగా భావిస్తూ వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మావోయిస్టు పార్టీని సమూలంగా నిర్మూలించే దుష్ట లక్ష్యంతో విప్లవ ప్రతిఘాతుక దాడులను కొనసాగిస్తున్నారు. 5 దశాబ్దాల భారత విప్లవ చరిత్రలో అనేక అణిచివేత.క్యాంపెయన్ లు చేపట్టారు. కాని ప్రజలు ప్రజాయుద్ధంతో అన్ని అణిచివేత క్యాంపియన్లను ఓడిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మూడు సంవత్సరాల్లో మావోయిస్టు రహిత భారత్ ను నిర్మిస్తామంటూ ఆపరేషన్ కగార్ పేరుతో వేలాది అర్థ సైనిక, సైనిక బలగాలను పెద్ద యెత్తున మోహరించి సైనిక క్యాంపెయన్ చేపట్టి అత్యంత కౄరమైన నరసంహార దాడిని తీవ్రతరం చేస్తూ హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్టుపాలనను కానసాగిస్తూ సామ్రాజ్యవాదులకు దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారు. ప్రగతిశీల, ప్రజాస్వామిక లౌకిక శక్తులపై, హేతువాదులపై కలందారీ మావోయిస్టులూ, అర్బస్ నక్సలైట్లు అంటూ ముద్ర వేసి వారిపై కక్షపూరిత దాడులు చేస్తున్నారు. అణిచివేతకు విప‌రీతమైన నిధులు కేటాయించి ఆయుధాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సాయుధ బలగాలను మరింత కౄరమైన అణిచివేత యంత్రాలుగా తయారు చేస్తూ దేశ ప్రజలపై యుద్ధానికి దింపారు. ఈ అమానవీయ దాడిని ప్రతిఘటిస్తూ కామ్రేడ్స్ కామ్రేడ్ సాగర్ (డివిసియం) కా. మనీరామ్, కా.లక్ష్మణ్ కర్రిగుట్టపై గ్రేహౌండ్స్ పోలీసులు చేసిన ఏక పక్ష కాల్పుల్లో అమరులయ్యారు. కా. మంగు(డివిసియం),కా. వర్గేష్(డివిపియం), కా. రాజు, కా. బుద్రు, మహారాష్ట్రలోని గడిచిరోలి.సీ60 పోలీసులు ఇన్ ఫార్నర్ల ద్వారా అన్నంలో విషమిచ్చి చంపారు. ఏప్రిల్ 16 ఆపటోల వద్ద డీఆర్జీ పోలీసులు వందల బలగాలు చుట్టిముట్టి చేసిన కాల్పుల్లో 29 మంది అమరులు కాగా అందులో 17మంది నిరాయుధులను పట్టుకొని గ్రామస్తుల ఎదుట కార్చి చంపారు. అందులో కా. సిరిసిల్ల సుధాకర్ (డివిసియం) (చల్లగరిగే) అమరుడయ్యాడు. ఏప్రిల్ 30న కాకూర్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో కా. జోగన్న కా. వినయ్ లతో పాటు 10 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. 2023 సెప్టెంబర్ 23న ప్రమాదవశాత్తు నదీ ప్రవహాంలో కొట్టుకెళ్లి కా. దామదాదా(యంయంసీ ఇంచార్జీ) అమరుడయ్యాడు, బీజాపూర్ జిల్లాలో ధర్మారం పోలీసు క్యాంపుపై పిఎల్జీఏ చేసినా సాహసోపేత రెయిడ్ లో శతృవు తూట తగిలి కా. దేవల్ (సీవైసీసీఎం), కా.విక్రమ్(సభ్యుడు) అమరులయ్యారు. అనారోగ్యంతో కస్తూరి పాడు గ్రామం పాలీ అమరురాలు అయింది. ఈ సంవత్సరాకాలంలో దేశ వ్యాప్తంగా 200 మందికి పైగా కామ్రేడ్స్ అమరలయినారు. వీరందరికి పేరు పేరునా తెలంగాణ రాష్ట్ర కమిటీ వినమ్రంగా తలవంచి జోహార్లు అర్పిస్తున్నది. వారి ఆశయ సాధనకు తుద వరకు పోరాడుతుందని ప్రతిన బూనుతున్నది. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియ జేస్తున్నది.

జగన్

అధికార ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర కమిటీ

సీపీఐ (మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad