Menu

ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే కామ్రేడ్‌ బసవరాజ్‌ హత్య

anadmin 3 weeks ago 0 1.7 K

ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్‌ హత్య జరిగిందని ఆ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రకటించింది. కేశవరావు భద్రతలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులు పోలీసులకు లొంగిపోయి ఆయన సమాచారాన్ని అందించారని ఆరోపించారు. కేశవరావుతో పాటు ఉన్న 35 మంది మావోయిస్టులు 60 గంటల పాటు పోరాడారని, చివరకు కేశవరావును పట్టుకొని కాల్చిచంపారని తెలిపారు. బసవరాజ్‌ స్మృతిలో ప్రపంచ వ్యాప్తంగా సంస్మరణ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ప్రకటన పూర్తిపాఠం కింద చదవచ్చు.

మా ప్రియమైన సహచరుడు, భారత విప్లవ ఉద్యమ గొప్ప నాయకుడు, మా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ బిఆర్ దాదా, నారాయణపూర్ జిల్లా, మాడ్ ప్రాంతంలోని గుండెకోట్ అడవిలో 2026 మే 21నాటి మారణహోమంలో అమరులయ్యారు. ఆ విప్లవ వీరుడికి శిరసు వంచి వినయపూర్వకమైన దండకారణ్య స్ట్రెషల్ జోనల్ కమిటీ నివాళులు అర్పిస్తోంది. ఈ మారణకాండలో వీరమరణం పొందిన వారితో పాటు సీసీ స్టాఫ్ రాష్ట్ర కమిటీ స్థాయి కామ్రేడ్ నాగేశ్వర్ రావు అలియాస్ మధు అలియాస్ జంగ్ నవీన్‌తోపాటు సిసి సిబ్బంది సంగీత, భూమిక, వివేక్, సీపీవైపిసి కార్యదర్శి కామ్రేడ్ చందన్ అలియాస్ మహేశ్, సీపీవైపిసి సభ్యుడు గుడ్డూ, రమే, లాల్సూ, సూర్య, మాసే, కమల, నగేష్‌, రాగో, రాజేష్, రవి, సునీల్, సరిత, రేష్మా, రాజు, జమున, గీత, హుంగీ, సన్కీ, బద్రు, నీలేష్, సంజు సహచరులందరికీ మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వినయపూర్వకంగా నివాళులర్పిస్తోంది. ఈ కామ్రేడ్స్‌ ఆశయాలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ అమరవీరుల కుటుంబాలకు మరియు స్నేహితులకు ప్రగాఢ సంతాపాన్ని, దుఃఖాన్ని తెలియజేస్తోంది.

ఈ అమరవీరుల జ్ఞాపకార్థం షహీద్ స్మృతి సభలను నిర్వహించాలని, వారి అత్యున్నత ఆశయాలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో పోరాట మార్గంలో ముందుకు సాగాలని దేశ పౌరులకు, పార్టీ, పీఎల్డీఎ శ్రేణులకు, ప్రపంచ శ్రామిక ప్రజలకు మరియు విప్లవాత్మక సంస్థలకు పిలుపునిస్తోంది. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ ప్రభుత్వం కుట్రలో భాగంగా జరిగిన ఈ క్రూరమైన ఊచకోతను తీవ్రంగా ఖండిస్తున్నాము.

మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా మాడ్‌లో ఉన్నారని పోలీసు నిఘా అధికారులకు ముందే తెలుసు. ఈ 6 నెలల్లో, మాడ్ ప్రాంతంలోని వివిధ యూనిట్ల నుండి కొంతమంది బలహీనంగా మారి పోలీసు అధికారులు ముందు లొంగిపోయి ద్రోహులుగా మారారు. వారి ద్వారా మా రహస్య సమాచారం నిఘా సంస్థలకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి. జనవరి, మార్చి నెలల్లో కామ్రేడ్ బిఆర్ దాదాను లక్ష్యంగా చేసుకున్నారనే రెండు పెద్ద దాడులు జరిగాయి. కానీ అవి విజయవంతం కాలేదు. ఈ ఆపరేషన్ల తర్వాత, గత ఒకటిన్నర నెలలో, ఆ యూనిట్‌లోని 6గురు శత్రువులకు లొంగిపోయారు. దాదా భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్న CYPC సభ్యులు కూడా వారిలో ఉన్నారు. మాడ్ ఉద్యమానికి నాయకత్యం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా అదే సమయంలో ద్రోహిగా మారాడు. దీంతో వారి పని సులువైంది. రికీతో సహా ఈ ద్రోహులందరూ కూడా ఆపరేషన్‌లో పాల్గొన్నారు. వారి కారణంగానే మనం ఇంత పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అడవులు, భూమి నుండి తరిమికొట్టి, వారి ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ఈ ద్రోహుల కారణంగానే సాధ్యమైంది.

మే 17 నుండి, ఓరా వైపు నుండి నారాయణపూర్, కొండగావ్ ప్రాంతాల్లో DRG సిబ్బందిని మోహరించడం ప్రారంభించారు. 18వ తేదీన, దంతెవాడ, బీజాపూర్, బస్తర్ ఫైటర్ నుండి DRG సైనికులు లోపలికి వెళ్లారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు మా యూనిట్ దగ్గరకు చేరుకున్నారు. ఆపరేషన్ కు ఒక రోజు ముందు, 17వ తేదీన, ఆ యూనిట్ లోని ఒక PPC సభ్యుడు తన భార్యతో పారిపోయాడు. వారు పారిపోయిన తర్వాత, శిబిరాన్ని అక్కడి నుండి తరలించాం. 19వ తేదీ ఉదయం, పోలీసు బలగాలు సమీపంలోని గ్రామానికి చేరుకున్నాయని సమాచారం అందిన తర్వాత, క్యాంప్‌ అక్కడి నుండి బయలుదేరింది. మార్గమధ్యలో, పోలీసు సిబ్బందితో మొదటి ఎన్ కౌంటర్ ఉదయం 10 గంటలకు జరిగింది. ఆ తర్వాత రోజంతా ఐదు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో ఎవరికి హాని జరగలేదు. చుట్టుముట్టబడిన ప్రాంతం నుండి బయటపడటానికి వారు 20వ తేదీన రోజంతా ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. రాత్రిపూట 20 వేల మంది పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

21వ తేదీ ఉదయం ఫైనల్ ఆపరేషన్ నిర్వహించారు. ఒకవైపు అత్యాధునిక ఆయుధాలతో అమర్చిన వేలాది మంది గూండాలు ఉన్నారు. ఆపరేషన్ సమయంలో వారికి ఆహారం, నీరు ఏర్పాట్లు హెలికాప్టర్ల ద్వారా చేరాయి. మరోవైపు, దేశంలోని సామాజిక-ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులు కేవలం 35 మంది మాత్రమే ఉన్నారు. మా వాళ్లు గత 60 గంటలుగా తినడానికి, త్రాగడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో ఉన్నారు. ఈ రెండు వైపుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. మా సహచరులు బిఆర్ దాదాను తమ మధ్య సురక్షితమైన స్థలంలో ఉంచి ప్రతిఘటించారు. DRG కి చెందిన కోట్లూ రామ్ మొదటి రౌండ్‌లోనే చనిపోయాడు. దీని తరువాత కొంతసమయం ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. తరువాత మళ్లీ కాల్పులు ప్రారంభించారు. ప్రతిఘటనను చురుకుగా నడిపిస్తూ అమరవీరుడైన మొదటి వ్యక్తి కమాండర్ చందన్. అయినప్పటికీ, అందరూ చివరి వరకు ధైర్యంగా ప్రతిఘటించారు. చాలా మంది సైనికులను గాయపరిచారు. ఒక బృందం ముందుకు సాగి చుట్టుముట్టిన ప్రాంతాన్ని ఛేదించగలిగింది. కానీ మిగిలిన వారు భారీ షెల్లింగ్ కారణంగా ఆ మార్గం గుండా తప్పించుకోలేకపోయారు. ముట్టడిని ఛేదించి, ఆ జట్టు ప్రధాన జట్టు నుండి విడిపోయింది. నాయకత్వాన్ని కాపాడే బాధ్యతను అందరూ చాలా చక్కగా నిర్వర్తిస్తూ, చివరి వరకు దాదాకు చిన్న గీత కూడా తగలనివ్వలేదు. అందరూ అమరులైన తర్వాత, కామ్రేడ్ బిఆర్ దాదాను సజీవంగా పట్టుకుని చంపారు. ఆ బృందంలో మా సహచరులు 35 మంది ఉన్నారు. వారిలో 28 మంది సహచరులు అమరవీరులయ్యారు. ఈ ఎన్ కౌంటర్ నుండి 7 మంది సురక్షితంగా బయటపడ్డారు. అమరవీరుల జాబితా భిన్నంగా ఉంది. కామ్రేడ్ నీలేష్ మృతదేహాన్ని PLGA గుర్తించింది.

ఇక్కడ గుర్తించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే, ఈ జోన్ అంతటా, మన వైపు నుండి ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించబడింది. కామ్రేడ్ బిఆర్ దాదా సూచన మేరకు ప్రభుత్వ సాయుధ దళాల చర్యలను ఆపివేసి శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు. 40 రోజుల్లో అలాంటి ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఈ సమయంలో, ఒక కుట్ర ద్వారా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద దాడిని నిర్వహించాయి. దీని గురించి ఒక్క మీడియా వ్యక్తి కూడా ఎటువంటి ప్రశ్నను లేవనెత్తడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం.
ప్రధాన నాయకత్వం భద్రత విషయంలో పార్టీ ఏం చేసింది… అనే ప్రశ్నలు అందరి మనసులో తలెత్తడం సాధారణ విషయమే. ఈ విషయానికి సమాధానం చెప్పాల్సి వస్తే అవును… మనం విఫలమయ్యాం. జనవరి నెల వరకు ఈ యూనిట్ సంఖ్య 60 కంటే ఎక్కువగానే ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో సులభంగా కదలడానికి వీలుగా సంఖ్యను తగ్గించారు. ఈలోగా ఆ కంపెనీలోని కొంతమంది సీనియర్ వ్యక్తులు బలహీనంగా మారి లొంగిపోయారు. సంఘటన జరిగినప్పుడు ఆ సంఖ్య 35కి చేరింది. ఏప్రిల్, మే నెలల్లో పెద్ద దాడులు జరుగుతాయని మేము ఇప్పటికే ఊహించాం. కానీ కామ్రేడ్ బసవరాజ్ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడానికి సిద్ధంగా లేడు. అతని భద్రత గురించి మేము అడిగినప్పుడు, అతని సమాధానం… “మీరు నా గురించి చింతించకండి, నేను ఈ బాధ్యతను రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే నిర్వర్తించగలను. మీరు యువ నాయకత్వం యొక్క భద్రతపై శ్రద్ధ వహించాలి. బలిదానాల నుండి ప్రేరణ పొంది, విప్లవోద్యమం అనేక రెట్లు ఎక్కువ బలంతో తిరిగి ఉద్భవిస్తుంది, ఈ ఫాసిస్ట్ ప్రభుత్వ దుష్ట ప్రణాళికలు ఫలించవు, అంతిమ విజయం ప్రజలదే అవుతుంది” అన్నారు. మా సహచరులు చాలా మంది దాదాను ఒప్పించడానికి ప్రయత్నించిన తర్వాత కూడా ఆయన వినలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన కేడర్తో కలిసి ఉండి, దగ్గరి మార్గదర్శకత్వం అందించాలని నిర్ణయించుకున్నారు.

మా ఉద్యమం మరియు నాయకత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, మీడియా ఈ విషయాన్ని గుర్తించాలి. నాయకత్వం తమ బాధ్యతలను వదిలి పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారందరూ సిగ్గుపడాలి. నిజమైన విప్లవకారులు ఎప్పటికీ భయపడరు. మనం దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాము. ప్రభుత్వం, ప్రతిఘాతుక శక్తులు విజయాన్ని జరుపుకుంటున్నాయి. దీనిని ఒక పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. ఇది వారికి ఒక పెద్ద విజయమని మేము నమ్ముతున్నాము. కార్పొరేట్ హిందూ దేశాన్ని నిర్మించాలనే వారి ప్రణాళికను అమలు చేస్తే దిశలో ఇది ఖచిత్రంగా ఒక విజయం. నవ భారతదేశం, అభివృద్ధి చెందిన భారతదేశం పేరుతో దేశాన్ని క్లార్పొరేట్ హిందూ దేశంగా మార్చాలనే ఆర్ఎస్ఎస్, బిజెపి ప్రణాళికతో విభేదించే కోట్లాది మంది దేశంలోని ప్రజలు ఈ నష్టం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇది భారత విప్లవ ఉద్యమానికి భారీ నష్టం. మే 21 చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుంది. బలమైన శత్రువును ఎదుర్కొన్నప్పుడు విప్లవోద్యమాలు ఇలాంటి నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. ఈ ఉద్యమం కామ్రేడ్ బసవరాజు యొక్క బలమైన భావజాలం, దీర్ఘకాల సహకారంపై నిర్మించబడింది. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే బలమైన క్యాడర్ అభివృద్ధి చెందింది. అనుభవజ్ఞులైన కామ్రేడ్లతో కూడిన కేంద్ర కమిటి ఉంది. వీటి ఆధారంగా, ఈ ప్రతికూల పరిస్థితి నుండి విప్లవాత్మక ఉద్యమాలు పుంజుకుంటాయి. ప్రభుత్వం తన పూర్తి అధికారాన్ని ఉపయోగిస్తోంది, ఇది మాత్రమే కాదు, సామ్రాజ్యవాదుల నుండి కూడా సహాయం పొందుతోంది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలు, నియమాలను ఉల్లంఘిస్తూ, దేశంలో సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు. పెద్ద ఫిరంగిదళాలు, ట్యాంకులను ఉపయోగిస్తున్నారు. సాయుధ విప్లవకారులను భౌతికంగా నిర్మూలించడంలో ఇది కొంతవరకు విజయవంతం కావచ్చు, కానీ విప్లవ ఆలోచనలను తొలగించడం సాధ్యం కాదు.

కాగర్ పేరుతో జరుగుతున్న ఈ ఊచకోత వెనుక ప్రభుత్వం నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని మేము దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మన దేశాన్ని, దేశ సంపదను, పర్యావరణాన్ని కాపాడటానికి తమ ప్రాణాలను త్యాగం చేసే నిజమైన దేశభక్తుల ఆలోచనలు, రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. దేశాన్ని, దాని ఆస్తులను అమ్మేస్తున్న వారికి వ్యతిరేకంగా సంఘటితమవుదాం.

భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, ఉగ్రవాదులు కలిసి ఉన్నట్లు ఆధారాలను ప్రదర్శిస్తోంది. ఇది నిజమని మనం నమ్మితే… పాకిస్తాన్ DGMO ఆదేశాల మేరకు కాల్పుల విరమణ వెంటనే ఎలా అమల్లోకి వచ్చింది? మన దేశంలోని ప్రజాస్వామ్య, విప్లవ ప్రజలు శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కాల్పుల విరమణ కోసం చేసిన విజ్ఞప్తులను వినకుండా ప్రభుత్వం వందలాది గిరిజన ప్రజలను, విప్లవకారులను హత్య చేయడానికి ప్రణాళికను అమలు చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? పాకిస్తాన్ తో కాల్పుల విరమణ అంశంపై మోడి నోరు మూయించిన శక్తి ఏది? ఏ విజయం సాధించామని తిరంగ యాత్ర నిర్వహిస్తున్నారు? ప్రజలను తప్పుదోవ పట్టించామనా? ఇలా చెప్పడమంటే మనం పాకిస్తాన్ తో యుద్ధం కోరుకుంటున్నామని కాదు. దేశంలో అధికారంలో ఉన్న వ్యక్తులు, బడా కార్పొరేట్లు, సామ్రాజ్యవాదుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి. వాళ్లకు అవసరమైనప్పుడల్లా, ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటారు.

గమనిక: విప్లవోద్యమంలో అమరవీరులైన సహచరుల త్యాగాల గురించి మా కేంద్రకమిటీ ఒక చిన్న పుస్తకాన్ని విడుదల చేస్తుంది.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad