Menu

మీరు సిద్దంగా ఉంటే ఈ ముగ్గురు ప్రతినిధులు వస్తారు – ఛత్తీస్‌ఘడ్ సీఎంకు బహిరంగ లేఖ!

anadmin 2 months ago 0 278

చత్తీస్ గడ్ ముఖ్యమంత్రికి భారత్ బచావో రాసిన లేఖ

భారత్ బచావో
25 ఏప్రిల్ 2025
గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారికి
ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం
రాయపూర్
గౌరవనీయులైన సర్,

2022 లో ఏర్పడిన పౌర సమాజ సంస్థ భారత్ బచావో తరపున, అంతర్గతంగా జరుగుతున్న అపారమైన ప్రాణనష్టాన్ని మీ దృష్టిని తేవాలనుకుంటున్నాము. రక్తపాతాన్ని ఆపడానికి మీరు తక్షణం జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాము. సంబంధిత పౌరులుగా, ఉద్రిక్తతలను తగ్గించడానికి, అవాంఛనీయ హత్యలను ఆపడానికి సాధ్యమైన ఏ ప్రయత్నాన్నయినా ప్రారంభించడానికి మేము మా సేవలను అందించాలనుకుంటున్నాము.

మీకు తెలిసినట్లుగా, కేంద్ర భద్రతా బలగాలు ఛత్తీస్‌గఢ్ బలగాల సహాయంతో మావోయిస్టులను నిర్మూలించడానికి 2024 జనవరి నుండి ఆపరేషన్ కగార్‌ను చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌లో పెరుగుతున్న ఘటనలు, హింస పట్ల భారత్ బచావో తీవ్ర ఆందోళన చెందుతోంది. 2024 నుండి, రాష్ట్రంలో 400 మందికి పైగా ఆదివాసీలను, మావోయిస్టులను చంపారు; ఒక్క బస్తర్ డివిజన్‌లోనే 300 కి పైగా క్యాంపులను ఏర్పాటు చేయడంతో సహా సైనికీకరణ గణనీయంగా పెరిగింది. బాధితుల్లో ఎక్కువ మంది నిరాయుధులైన ఆదివాసీలేనని, వీరిలో పిల్లలు, మహిళలు, అమాయక పౌరులు ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద శాంతియుతంగా నిరసన తెలిపే సంస్థలను నిషేధించడం, రోజువారీ కేసులు పెట్టడం, అరెస్టులను చేయడం తీవ్ర ఆందోళనలనను కలిగిస్తోంది.

భారీ ప్రాణనష్టం జరిగిన ఈ తీవ్రమైన పరిస్థితితో ఆందోళన చెందిన భారతదేశం అంతటా అనేక మంది మేధావులు, సంస్థలు మావోయిస్టులు- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాంతి సంభాషణను ప్రారంభించాలని ప్రతిపాదించాయి. మావోయిస్టు పార్టీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించి కాల్పుల విరమణను, శత్రుత్వాల విరమణను ప్రతిపాదించారు. ప్రతిస్పందనగా, అటువంటి చర్చలు శాశ్వత శాంతి కోసం స్పష్టమైన చర్యలకు దారితీస్తాయనే షరతుతో ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన శ్రీ విజయ్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వం సంభాషణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని, తెలియజేశారు.
అయితే, సంభావ్య చర్చల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు, తెలంగాణతో ఉన్న అటవీ సరిహద్దు ప్రాంతాలలో భద్రతా దళాలను భారీగా మోహరించారని, వైమానిక బాంబు దాడులు కూడా జరిగాయని మాకు తెలిసింది. ఈ ఆకస్మిక ఘర్షణలు ఆదివాసీలు, మావోయిస్టులు, భద్రతా బలగాలలో కూడా అనవసరమైన ప్రాణనష్టానికి దారితీయవచ్చు.

శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి, అన్ని వైపుల నుండి ప్రాణనష్టాన్ని ఆపడానికి మానవతా దృక్పథంతో జోక్యం చేసుకోవాలని మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము. రక్తపాతం లేకుండా అర్థవంతమైన శాంతిని తీసుకురావడానికి మావోయిస్టులతో చర్చలు జరపడానికి మేము మా సేవలను అందించాలనుకుంటున్నాము. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య రక్తపాతం ముగియాలని, మావోయిస్టులు- ప్రభుత్వం మధ్య శాంతి సంభాషణ ప్రారంభం కావాలని భారత్ బచావో హృదయపూర్వకంగా ఆశిస్తోందిది. దీనిని సులభతరం చేయడానికి, ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించాలి, సుప్రీంకోర్టు సముచితంగా చెప్పినట్లుగా, “తన సొంత పిల్లలను చంపడం ఆపండి”.
ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉంటే, భద్రతా బలగాల చర్యలను నిలిపివేయడానికి, శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి సున్నితమైన ప్రాంతానికి వెళ్లడానికి సంధానకర్తల బృందాన్ని అనుమతించడానికి సిద్ధంగా ఉంటే, మేము ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ (షహీద్ భగత్ సింగ్ మేనల్లుడు), ప్రొఫెసర్ జి హరగోపాల్ (2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ నక్సలైట్ల మధ్య జరిగిన చర్చల సమయంలో సంధానకర్త; అలాగే అలెక్స్ పాల్ మీనన్ కిడ్నాప్ సంక్షోభం సమయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ సంధానకర్త), ప్రొఫెసర్ మనోరంజన్ మొహంతి (రాజకీయ శాస్త్రవేత్త), ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పౌర హక్కులు, సామాజిక కార్యకర్తలు చర్చల బృందంలో భాగం కావాలని మేము అభ్యర్థించాలనుకుంటున్నాం.

భారత్ బచావో అనేది 2022లో ఏర్పడిన పౌర సమాజ సంస్థ, ఇది భారత స్వాతంత్య్ర‌ ఉద్యమ స్ఫూర్తిని, విలువలను నిలబెట్టడానికి అంకితం అయిన సంస్థ. భారత రాజ్యాంగంలోని మూల సూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా పని కులం, విశ్వాసం లేదా మతంతో సంబంధం లేకుండా ప్రజలలో మత సామరస్యాన్ని, శాంతియుత సహజీవనాన్ని పెంపొందించడంపైన దృష్టి పెడుతుంది. అదనంగా, రాజ్యాంగం ద్వారా వారికి హామీ ఇవ్వబడిన హక్కుల సాధన కోసం, దళితుల, ఆదివాసుల సాధికారత కోసం మేము కృషి చేస్తాము.
మా ప్రతిపాదనను సానుకూలంగా పరిగణించి, మా సొంత సోదర, సోదరీమణుల ప్రాణాలను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మేము మరోసారి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇటీవల ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా మావోయిస్టులను “సోదరులు” అని ప్రస్తావించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము. మన సోదరులు మావోయిస్టులు అయినా, ఆదివాసీలు అయినా, భద్రతా దళాలు అయినా, వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నాలలో మనమంతా కలిసికట్టుగా ఉందాం.
మీ నుంచి సానుకూల ప్రతిస్పందనకు ఎదురుచూస్తున్నాం
కృతజ్ఞతలు
డా. ఎం.ఎఫ్. గోపీనాథ్
వైస్ ఛైర్మన్
భారత్ బచావో
గాదె ఇన్నయ్య
ఆర్గనైజింగ్ సెక్రటరీ
భారత్ బచావో
జంజార్ల రమేష్ బాబు
భారత్ బచావో నేషనల్ కౌన్సిల్
Contact No : 7995539191
8185993218

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad