
మధ్య భారతంలో కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరుతో సాగిస్తున్న మానవ హననాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కేరళలో పలు ప్రజా సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. వాయ్ నాడ్ లోని మనంతవాడిలో బుధవారం నాడు జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతి చర్చలు జరపాలని, సీజ్ ఫైర్ పాటించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.


