చత్తీస్ గడ్ లో 2025 జనవరి నుండి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 78 మంది ఆదివాసులు, మావోయిస్టులను హత్యచేశాయని మావోయిస్టు పార్టీ మండిపడింది. ఇందుకు నిరసనగా ఏప్రెల్ 4న బీజాపూర్ జిల్లా బంద్ కు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ అధికార ప్రతినిధి మోహన్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం…
2025 జనవరి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న ‘హంతక కగార్’ దాడులలో మావోయిస్టులనూ, ఆదివాసీ ప్రజలను 78 మందిని హత్యగావించడాన్ని ఖండించండి!
ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా ‘బంద్’ను పాటించండి!!
2025 జనవరి 12న బందెపార దగ్గర 5గురు కామ్రేడ్స్,ఫిబ్రవరి 1న ఏడుగురు గ్రామస్తులు, ఫిబ్రవరి 9న జలిపేరు దగ్గర 31 మంది కామ్రేడ్స్, మార్చి 20న గంగలూర్ ఏరియాలో 26 మంది కామ్రేడ్స్, అదే రోజు కాంకేర్ లో జరిగిన ఘటనలో 4గురు కామ్రేడ్స్, మార్చి 25న మాడ్ డివిజన్, ఇంద్రావతి ఏరియాలో 3గ్గురు కామ్రేడ్స్ మొత్తం 78 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. వీరందరికీ వినమ్రంగా జోహార్లర్పిద్దాం.
4 దశాబ్దాలుగా దండకారణ్య విప్లవోద్యమం వేలూనుకొని, బలపడి జనతనసర్కార్లను నిర్మించి, ప్రజారాజ్యాధికార పాలనను విస్తృతం చేస్తున్న మావోయిస్టు పార్టీనీ, అండగా నిలిచిన ఆదివాసీ సమాజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలపై ‘కగార్’ యుద్ధాన్ని ప్రకటించింది. మార్చ్ 31, 2026 నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్బాలు పలుకుతున్నాయి. అందులో భాగంగానే ఈ ‘కగార్’ దాడులను అర్థం చేసుకోవాల్సి ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పధకం ప్రకారం 2, 3 రాష్ట్రాలను సమన్వయం చేస్తూ 4, 5 జిల్లాల సాయుధ బలగాలైన బస్తర్ ఫైటర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీ60 కమాండోలు, సీ.ఆర్.పీ.ఎఫ్, బీ.ఎస్.ఎఫ్, కోబ్రా, ఎస్.ఎస్.ఎఫ్ బలగాలతో 4 వేల నుండి 10వేల సంఖ్యలో తరలించి అనేక వలయాలుగా చుట్టుముట్టి సంయుక్త దాడులను నిర్వహిస్తున్నారు. ఈ దాడుల లక్ష్యం దండకారణ్య అటవీ ప్రాంతం నుండి ఆదివాసీ ప్రజలను ఖాళీ చేయించడం, వారికి అండగా నిలబడిన మావోయిస్టులనూ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడం. ఇక్కడి ఖనిజ వనరులనూ, అటవీ సంపదలను సామ్రాజ్యవాదులకూ, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం. ఇది ప్రజావ్యతిరేక ఫాసిస్టు పాలకవర్గాల కుట్రపూరితమైన ‘కగార్ దాడి లక్ష్యం. దీనిని అన్ని సెక్షన్ ల ప్రజలు ఖండించవలసిందిగా, ఆదివాసీ ప్రజలకూ, వారి పోరాటానికి మద్దతునివ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల ప్రజాస్వామిక హక్కులనూ, ప్రజల పోరాట చైతన్యాన్ని, కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా
ఉంది.
అమరుల పేర్లు, వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి…
జనవరి 3న జప్పుర్ గ్రామస్తుడు మాడివి జోగాల్ ను చిత్రహింసలు పెట్టి హత్యగావించారు.
జనవరి 12న బందెపార ఘటనలో 5గురు – కామ్రేడ్ రైను (ఏ.సీ.ఎమ్), కామ్రేడ్ జ్యోతి (పీ.ఎమ్), కామ్రేడ్ అనిత (పీ.ఎమ్) బందెపార గ్రామస్తులైన ఎచ్చాం రమేష్, మిచ్చా రమేష్.
ఫిబ్రవరి 1న తోడ్క ఘటనలో ఒక పీ.ఎల్.జీ.ఏ కామ్రేడ్ తోపాటు 7 గురు గ్రామస్తులను హత్య గావించగా, అందులో 5గురు తోడ్క గ్రామస్తులు – తాతి శకంర్, తాతి మంగాల్, తాతి రాణు, తాతి సన్ను, తాతి కమ్లు లు ఉండగా, ఇద్దరు కొర్చేలి గ్రామస్తులు పొట్టాం లచ్చు, పద్దాం బీజు మొత్తం ఎనిమిది మందిని హత్యగావించారు. నలుగురు గ్రామస్తులు గాయపడగా, 40 మంది ప్రజలను అరెస్టు చేసి బీజాపూర్ తీసుకెళ్లారు.
జలిపేరు ఘటనలో 31 మంది కామ్రేడ్స్ – పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ఉంగాల్ తో పాటు కామ్రేడ్ మంగు (పీ.పీ.సీ.ఎమ్, 11వ పీ.ఎల్ కమాండర్), కామ్రేడ్ సోను (ఏ.సీ.ఎమ్, డివిజన్ సీ.ఎన్.ఎమ్ కమాండర్), కామ్రేడ్ సుభాష్ (ఏ.సీ.ఎమ్, నేషనల్ పార్క్ ఏ.ఆర్.పీ.సీ అధ్యక్ష్యుడు), కామ్రేడ్ బజిని (ఏ.సీ.ఎమ్, డివిజన్ సీ.ఎన్.ఎమ్ డిప్యూటీ కమాండర్), పార్టీ సభ్యులు -కామ్రేడ్ కేషా, కామ్రేడ్ రఘు, కామ్రేడ్ రోజా, కామ్రేడ్ జ్యోతి, కామ్రేడ్ మీనా, కామ్రేడ్ మైనీ, కామ్రేడ్ హిడ్మా, కామ్రేడ్ సోను, కామ్రేడ్ సోంబార్ వీరంతా గంగలూర్ ఏరియా భూమి పుత్రికలు, పుత్రులు. కామ్రేడ్ నెహర్, కామ్రేడ్ మన్ని, కామ్రేడ్ సంజతి, కామ్రేడ్ రాజు, కామ్రేడ్ దేషు, కామ్రేడ్ అమర్, కామ్రేడ్ సరిత, కామ్రేడ్ శాంతి వీరంతా భైరన్ ఘడ్ ఏరియా భూమి పుత్రికలు, పుత్రులు. కామ్రేడ్ రాజు, కామ్రేడ్ సన్ను, కామ్రేడ్ సుకుమత్తి, కామ్రేడ్ రమేష్, కామ్రేడ్ సంజయ్, మరో ఇద్దరు గ్రామస్తులు కామ్రేడ్ పెంట, కామ్రేడ్ అనమయ్య వీరంతా నేషనల్ పార్క్ ఏరియా భూమి పుత్రికలు, పుత్రులు. కామ్రేడ్ మల్లె, కామ్రేడ్ కలా వీరిద్దరూ మద్దేడ్ ఏరియాకు చెందిన భూమి పుత్రికలు.
బీజాపూర్-దంతెవాడ-సుక్మా జిల్లాల నడుమ గంగలూర్ ఏరియా, ఆండ్రి దగ్గర మార్చి 20న జరిగిన ఘటనలో –
- కామ్రేడ్ కడితి సీతో (డీ.వీ.సీ.ఎమ్, దంతెవాడ జిల్లా, ముండేరు గ్రామం) డీ.కే మహిళా సబ్ కమిటీ సభ్యురాలు
- కామ్రేడ్ పూనెం సుక్కి (ఏ.సీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, పూస్ నార్ గ్రామం) పిడియా ఎల్.ఓ.ఎస్ కమాండర్
- కామ్రేడ్ మడకం వాగ ( పీ.పీ.సీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, పమ్రా గ్రామం) 13వ పీ.ఎల్ కమాండర్ 4. కామ్రేడ్ పూనెం బద్రు ( పీ.పీ.సీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, ములంగ గ్రామం) 13వ పీ.ఎల్
- కామ్రేడ్ పద్ధం కోసి ( పీ.పీ.సీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, దోడ్ తూమునార్ గ్రామం) 13వ పీ.ఎల్
- కామ్రేడ్ లేకం క్రాంతి (ఏ.సీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, పెద్దాం గ్రామం) గంగలూర్ ఏరియా
- కామ్రేడ్ ఓయం సుఖురాం (ఏ.సీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, తిమ్మెనార్ గ్రామం) గన్పూర్ జనమిలీషియా కమాండర్
- కామ్రేడ్ ఆప్కా సుకాయి (ఏ.సీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, కాకేకొర్స గ్రామం)
- కామ్రేడ్ కుంజం మధు (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, గన్పూర్ గ్రామం) డివిజన్ కమ్యూనికేషన్
- కామ్రేడ్ ప్రసిక్ వర్గేష్ (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, ముదివెండి గ్రామం) 13వ పీ.ఎల్ 11. కామ్రేడ్ పొడియం మోటు (పీ.ఎమ్, జీజాపూర్ జిల్లా, అక్వా గ్రామం) 13వ పీ.ఎల్ 12. కామ్రేడ్ కొర్స అయితే (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, కోక్రా గ్రామం) గార్డ్ 13వ పీ.ఎల్ 13. కామ్రేడ్ రేంగో సరిత (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, బెల్లంనేండ్ర గ్రామం) 13వ పీ.ఎల్ 14. కామ్రేడ్ వేకో జున్ని (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, డాలేరు గ్రామం) 13వ పీ.ఎల్
- కామ్రేడ్ మాడివి సుశీల (ఏ.సీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, ఉర్రెపాల్ గ్రామం) 13వ పీ.ఎల్, బైరన్ ఘడ్ ఏరియా మిలీషియా కమాండర్ ఇన్ ఛీఫ్
- కామ్రేడ్ కుర్సం జితెన్ (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, కట్టపల్లి గ్రామం) 13వ పీ.ఎల్ డాక్టర్
- ఓయం లక్మా (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, పిడియా గ్రామం) 13వ పీ.ఎల్
- కామ్రేడ్ హేమ్ల ఉమేష్ (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, వెడిసేర్ గ్రామం) 13వ పీ.ఎల్
- కామ్రేడ్ ఓయం మంగు (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, పిడియా గ్రామం) 13వ పీ.ఎల్
- కామ్రేడ్ పూనెం లచ్చి (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, దోడ్ తూమునార్ గ్రామం) పిడియా ఎల్.ఓ.ఎస్ 21. కామ్రేడ్ కామే (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, పామేడ్ ఏరియా, కొంజేర్ గ్రామం) 13వ పీ.ఎల్ 22. కామ్రేడ్ పూనెం రాధ (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, హిరోలి గ్రామం) డివిజన్ కమ్యూనికేషన్ టీం 23. కామ్రేడ్ మజ్జి బబిత (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, మజ్జిమేండ్రి గ్రామం) 13వ పీ.ఎల్
- కుంజం సంతు (పీ.ఎమ్, బీజాపూర్ జిల్లా, గన్పూర్ గ్రామం)
వీరితోపాటు ఇద్దరు (25, 26 )కొత్తగా వచ్చిన కామ్రేడ్స్ అమరులయ్యారు. పేర్లు తెలియాలి.
అదే రోజున (మార్చి 20) కాంకేర్-నారాయణపూర్ జిల్లాల నడుమ జరిగిన ఘటనలో నలుగురు కామ్రేడ్స్ అమరులయ్యారు.
మార్చి 25న దంతెవాడ-బీజాపూర్ జిల్లాల నడుమ మాడ్ డివిజన్, ఇంద్రవతి ఏరియాలో బుడగ గ్రామం దగ్గర కామ్రేడ్ సుధీర్ (సీనియర్ కామ్రేడ్,ఏ.సీ.మ్), కామ్రేడ్ ఆత్రం పాండ్రు, కామ్రేడ్ బాడ్స మన్ను లు అమరులయ్యారు.
చత్తీస్ ఘడ్ లో ఖనిజసంపదనూ, అటవీ సంపదను కాపాడుతూ దశాబ్దాలుగా పోరాడుతున్న ఆదివాసీ ప్రజలను హత్య గావించడాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, వివిధ ప్రజాసంఘాలు ఖండిస్తున్నప్పటికీ సమస్యలను రాజకీయంగా పరిష్కరించాలనీ, సైనికంగా కాదని దేశవిదేశాలలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నప్పటికీ బీజేపీ హిందుత్వ పాలకవర్గం డబలింజన్ సర్కార్ లతో ప్రజావాణిని లెక్కచేయకుండా ప్రజలపై దారుణమైన హింసాకాండనూ, ఫాసిస్టు నిర్బంధాన్ని అమలు చేస్తున్నది. మోదీ-అమిత్ షాల దుష్టపాలనకు వ్యతిరేకంగా, ‘కగార్’ హింసాకాండకు వ్యతిరేకంగా పోరాడవలసిందిగా పీడిత ప్రజానీకానికీ, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
జనవరి 12 నుండి మార్చి 25 వరకు ‘కగార్’ దాడులలో 78 మంది కామ్రేడ్స్ నూ, ప్రజలను హత్యగావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాశవిక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా అంతటా ‘బంద్’ పాటించాలని కోరుతున్నాం.
అధికార ప్రతినిధి,
మోహన్,
పశ్చిమ బస్తర్ డివిజన్,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).