Menu

మనుస్మృతి పై చర్చ చేసినందుకు విద్యార్థులపై దాడి, అరెస్టులు, అక్రమ కేసులు

anadmin 6 months ago 0 112

1927 డిసంబర్ 25 న బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేసిన రోజు. ఆ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ BHU విద్యార్థులు భగత్ సింగ్ స్టూడెంట్స్ మోర్చా అద్వర్యంలో మనుస్మృతిపై చర్చా కార్యకరమం నిర్వహించారు.
చర్చ జరుగుతున్న సమయంలో, BHU ప్రొక్టోరియల్ బోర్డ్ గార్డులు వచ్చి విద్యార్థులపై దాదికి దిగారు. దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించారు. రాత్రి 7:30 గంటలకు వారిని ప్రొక్టోరియల్ బోర్డు కార్యాలయానికి లాక్కెళ్ళి నిర్బంధించారు. ఈ సమయంలో విద్యార్థులకు గాయాలయ్యాయి, విద్యార్థుల దుస్తులు చిరిగిపోయాయి, వారి అద్దాలు పగలగొట్టారు. నిర్బందంలో ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రోక్టోరియల్ బోర్డ్ కార్యాలయం ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో గార్డులు వాళ్ళపిఅ కూడా దాడికి తెగబడ్డారు. కొంత సేపటికి అక్కడికి వచ్చిన పోలీసులు విద్యార్థులను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి ముగ్గురు బాలికలతో సహా విద్యార్థులందరిపై దాడి చేశారు.

సాయంత్రం తర్వాత బాలికలను పోలీసులు నిర్బంధించడం చట్ట ఉల్లంఘన, అధికార దుర్వినియోగం అయినప్పటికీ వారణాసిలోని లంకా పోలీస్ స్టేషన్‌కు విద్యార్థులను తీసుకెళ్ళిన పోలీసులు, పై నుండి ఆర్డర్స్ ఉన్నాయంటూ చెప్పారని, ఇది BJP, RSS-ABVP వంటి మనువాది-ఫాసిస్ట్ శ‌క్తుల కుట్రే అని భగత్ సింగ్ స్టూడెంట్స్ మోర్చా (BSM) అధ్యక్షురాలు అకాంక్షా ఆజాద్ ఆరోపించారు.

25వ తేదీ రాత్రంతా పోలీసుస్టేషన్ లోనే విద్యార్థులను ఉంచి ఈ రోజు సాయంత్రం 13 మంది విద్యార్థులను కోర్టుకు హాజరు పర్చారు. వీరిపై పోలీసులు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే సెక్షన్ 121(2) తో సహా అనేక కేసులు బనాయించారు.

ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన భగత్ సింగ్ స్టూడెంట్స్ మోర్చా అధ్యక్షురాలు ఆకాంక్షా ఆజాద్, 1927లో డాక్టర్ అంబేద్కర్ మనుస్మృతిని తగులబెట్టినప్పుడు ఆయనపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి కేసుపెట్టలేదని అన్నారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల మనుస్మృతిని అనేక ఏళ్ళుగా తగలబెడుతూనే ఉన్నారని, అలాంటిది దానిపై చర్చ జరిపినందుకే విద్యార్థులను ఎందుకు అరెస్టు చేశారని ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
యోగి ప్రభుత్వం , దాని పోలీసులు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారా లేక‌ మనుస్మృతిపై ప్రమాణం చేశారా అని ఆమె మండిపండింది.

అరెస్టైన విద్యార్థుల వివరాలు…

  1. ముఖేష్ కుమార్ S/O రాంపాల్ చిరునామా BA ఆనర్స్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, థానా లంక, వారణాసి వయస్సు 19 సంవత్సరాలు.
  2. సందీప్ జైస్వర్ S/O అమర్జీత్ జైస్వర్ B.A ఆనర్స్ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సైన్సెస్, థానా లంక, వారణాసి, వయస్సు 27 సంవత్సరాలు.
  3. అమర్ శర్మ S/O అఖిలేష్ శర్మ BA ఆనర్స్ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సైన్సెస్, థానా లంక, వారణాసి, వయస్సు 20 సంవత్సరాలు.
  4. అరవింద్ పాల్ S/O రాజ్‌నాథ్ పాల్ M.A. హిందీ, పోలీస్ స్టేషన్ లంక, వారణాసి, వయస్సు 25 సంవత్సరాలు.
  5. అనుపమ్ కుమార్ S/O అఖిలేశ్వర ప్రసాద్ సింగ్ రీసెర్చ్ ఫిలాసఫీ, థానా లంక, వారణాసి, వయస్సు 29 సంవత్సరాలు.
  6. లక్ష్మణ్ కుమార్ S/O కప్పిల్ రే B.A ఆనర్స్ ఫ్యాకల్టీ, థానా లంక, వారణాసి, వయస్సు 21 సంవత్సరాలు.
  7. అవినాష్ S/O ఉమేష్ కుమార్ సింగ్, విద్యార్థి BHU, థానా లంక, వారణాసి, వయస్సు 24 సంవత్సరాలు.
  8. అరవింద్ S/O సురేష్, విద్యార్థి BHU, థానా లంక, వారణాసి, వయస్సు 23 సంవత్సరాలు.
  9. శుభం కుమార్ S/O భోలా పాశ్వాన్, విద్యార్థి BHU, థానా లంక, వారణాసి, వయస్సు 21 సంవత్సరాలు.
  10. ఆదర్శ్ S/O అవధేష్ కుమార్, విద్యార్థి BHU, థానా లంక, వారణాసి, వయస్సు 22 సంవత్సరాలు.
  11. ఇప్సితా అగర్వాల్ D/O చందేల్ ప్రకాష్, Msc సైకాలజీ, BHU, థానా లంక, వారణాసి.
  12. సిద్ది తివారీ D/O రాజేష్ తివారీ MA సోషియాలజీ B.K.M, BHU, థానా లంక, వారణాసి.
  13. కాత్యాయని B. రెడ్డి D/O వెంకటేష్ రెడ్డి B.A ఆనర్స్ ఫ్యాకల్టీ, BHU, థానా లంక, వారణాసి.
Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad