Menu

‘రేవంత్ సర్కార్ చేసిన‌ 16 మంది మావోయిస్టుల హత్యలపై హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరపించాలి’

anadmin 6 months ago 0 210

ఈ నెల 1వ తేదీన జరిగిన ఏటూరు నాగారం ఎన్ కౌంటర్ , గతంలో భధ్రాద్రి కొత్తగూడెంజిల్లా లో జరిగిన ఎన్ కౌంటర్ తో సహా ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ 16 మంది మావోయిస్టులను చంపేసిందని, వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం…

డిసెంబర్ 1న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వారికి అన్నంలో విషం పెట్టి చిత్రహింసల గురిచేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ప్రజల నుండి వచ్చిన సమాచారం ప్రకారం అన్నంలో విషం కలిపి హత్య చేసినట్లుగా తెలియ వచ్చింది. అదే నిజమని ఎన్కౌంటర్ మృత శరీరాలను చూస్తే అర్థమవుతున్నాయి. మృతుడు మధు శవాన్ని సహచరి మీన చూసిన తర్వాత వాస్తవాలు ఇంకా అర్థమయ్యాయి. ఎన్కౌంటర్ అంటే ఎదురుకాల్పులని అర్దం కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్కౌంటర్ అంటే పట్టుకొని కాల్చి చంపడం అని అందరికీ తెలిసిందే. గత బీరెఎస్ ప్రభుత్వం హయాంలో 2017 లో మేడారంలో జరిగిన శృతి, సాగర్ ల ఎన్కౌంటర్లో వాళ్లపై జరిగిన హింసను చూస్తే అవి ఎన్కౌంటర్లు కాదని ప్రభుత్వ హత్యలు అని పూర్తిగా స్పష్టం అయింది. గ్రామాల్లోకి వచ్చిన ఈ ఉద్యమకారులకు ప్రభుత్వమే విషాహారం పెట్టించి స్పృహ తప్పిపోయిన తర్వాత తీవ్రంగా చిత్రహింసల గురిచేసి ముఖాలను నుజ్జునుజుగా చేసి, శృతి చేయి విరగ్గొట్టి హత్య చేశారు.

అధికారంలోకి రాకముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమాలను చూసి ప్రజలు తమ మౌలిక సమస్యల పరిష్కారం కోసం నక్సలైట్లు రావాలని కోరుకుంటున్నారని ప్రకటించి ఉన్నాడు.కానీ అధికారంలోకి వచ్చాక‌ మావోయిస్టు పార్టీని ఒక రాజకీయ పార్టీగా గుర్తించడంలో, మావోయిస్టులను ఉద్యమకారులుగా గుర్తించడంలో విఫలం అవుతూ ఇప్పటికే 16 మందిని ఎన్కౌంటర్ రూపంలో హత్య చేశాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో శాంతి చర్చలు జరిపింది. ఆరు నెలల పాటు ఎన్కౌంటర్ హత్యలు లేకుండా శాంతి కాలం కొనసాగింది. ఆ చరిత్ర తెలిసిన రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి మావోయిస్టులపైన‌, ఆదివాసీ ఉద్యమాలపైన దాడులు చేస్తున్నాడు.

ఆదివాసి ఉద్యమాలపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా అనేక వందల సైనిక క్యాంపుల నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హననాన్ని ఏడాది కాలంగా కొనసాగిస్తూ వస్తున్నది. ఇప్పటికే సుమారు 300 కు పైగా ఆదివాసీలు, ఉద్యమకారులు హత్యలకు గురికాబడ్డారు.కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ కగార్ లో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ బార్డర్లో ఇప్పటికే మూడు చోట్ల మిలటరీ క్యాంపు లను ఏర్పాటు చేశారు. ఇంకో నాలుగు చోట్ల ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేగాక ఒకవైపు ఉద్యమాలు మౌలిక సమస్యల పరిష్కారం వైపుగా ఉంటాయని చెప్తూనే అదే ఉద్యమకారులను ఎన్కౌంటర్ పేరుతో కిరాతకంగా హత్య చేస్తున్నారు. అది జలగం వెంగళరావు పీరియడ్ నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నది. 2009లో ఎన్కౌంటర్ హత్యలపై వచ్చిన ఉమ్మడి హైకోర్టు ఆంధ్ర ప్రదేశ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను పక్కన పెట్టారు దానితోనే ఈ ఎన్కౌంటర్ హత్యకాండ నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఇప్పటికైనా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్కౌంటర్ తీర్పు ను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.

ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 మంది ఉద్యమకారులను ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారు. నవంబర్ ఐదు న జరిగిన రఘునాధపాలెం ఎన్కౌంటర్ పై నిజానిర్దారణ కోసం బయలుదేరిన వారిని అశ్వరావుపేటలో నిర్బంధించారు. చరిత్రలో ఎప్పుడు కూడా నిజనిర్ధారణ బృందాలను అరెస్టు చేసిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వాని బద్దంగా పరిపాలించాలని ఎన్కౌంటర్ లేని తెలంగాణ నిర్మించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.

డిమాండ్స్:

1.తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిన అన్ని ఎన్కౌంటర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి

  1. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పాలి

3.డిసెంబర్ ఒకటిన జరిగిన ములుగు ఎన్కౌంటర్ మృతుల శ‌వాలను నిపుణులైన ఫోరెన్సిక్ బృందంచే శ‌వ పరీక్ష నిర్వహించాలి.

ప్రొఫెసర్ హరగోపాల్,
ఎన్ నారాయణరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ)
బల్లా రవీంద్రనాథ్ (రాజకీయ ఖైదీల విడుదల కమిటీ )
టి సురేష్ కుమార్ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్ లాయర్స్, ఐఏపీఎల్)
మీనా (మధు సహచరి)
కే రాంబాబు( తెలంగాణ ప్రజాఫ్రంట్ , టిపిఎఫ్ )

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad