తెలంగాణలో రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత పోలీసులు రక్తాన్ని పారిస్తున్నారు. సెప్టంబర్ నెలలో భధ్రాద్రి కొత్త గూడెంజిల్లాలో ఆరుగురు మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేర్ అకాల్చి చంపిన రేవంత్ సర్కార్ ఈ రోజు ములుగు జిల్లాలో ఏడుగురిని చంపేసింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఎప్పటిలాగే పోలీసులు ఈ సంఘటనను ఎన్ కౌంటర్ అనే కథను వినిపిస్తున్నాయి.
ఈ సంఘటనలో ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35),ఏటూరునాగారం మహదేవ్ పూర్ కార్యదర్శి ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్ (23) మరణించారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పెద్ద మొత్తం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే ఇది ఎన్ కౌంటర్ కాదని కోవర్టుల ద్వారా మావోయిస్టులకు తినే ఆహారంలో విషం కలిపి అనంతరం కాల్చి చంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.