Menu

మావోయిస్టు నాయకుడు విక్రమ గౌడను వారం క్రితమే పట్టుకొని నిన్న కాల్చి చంపారా ?

anadmin 7 months ago 0 435

కర్నాటకలో మావోయిస్టు పార్టీ నాయకుడు విక్రమ గౌడ ను పోలీసులు హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయనను వారం క్రితమే పట్టుకున్న పోలీసులు చిత్ర హింసలపాల్జేసి నవంబర్ 18 రాత్రి కాల్చి చంపారని వార్తలు వస్తున్నాయి. పోలీసులు చెప్తున్న ఎన్ కౌంటర్ కట్టు కథలపై నిరసనలు వస్తున్నాయి. విక్రమ గౌడ హత్యపై కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పి తీరాల్సిందే అని ప్రముఖ న్యాయవాది బాలన్ అంటున్నారు.

విక్రమ్ గౌడ ఎన్‌కౌంటర్ గురించి.. సీనియర్ అడ్వకేట్ బాలన్ మాటల్లో…

కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యుదయకరమైనదని, దేశాన్ని కాపాడే ప్రభుత్వం అని, పేదల ప్రభుత్వం అని, శ్రామికుల, ఆదివాసీల, దళితుల, అల్ప సంఖ్యాకుల ప్రభుత్వం అని అంటారు. అణగారినవారు, మూలనివాసులు, ఆదివాసులతో కలిసి పనిచేస్తున్న ఒకరిని పోలీసులు చంపేసారు. దీనిపై సిద్ధరామయ్యగారు సమాధానం చెప్పాలి. పోలీసులు చంపేసారు అంటే, చంపడానికి వారికి అధికారం ఎవరు యిచ్చారు? తప్పు చేస్తే అరెస్టు చేసి జైలుకి పంపండి. పోలీసుల అధికారం తిరుగులేనిది. పోలీసులకు వ్యతిరేకంగా ఎవరైనా పోరాడగలరా? మీ దగ్గర ఎకె 47 వుంది… బలగాలు వున్నాయి …అమాయకుల దగ్గర ఏముంటుంది?వారి చేతిలో ఏముంది? వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం యిచ్చి తీరాలి.
విక్రమ్ గౌడను నిన్న రాత్రి పది గంటలకు హత్య చేశారు. హత్య చేసింది ఎవరు? ఇంకా తెలియడంలేదు. ఎన్‌కౌంటర్ అంటున్నారు.. ఎన్‌కౌంటరా కాదా అన్నది ఫోరెన్సిక్ పరీక్ష చేస్తే తెలుస్తుంది. ఎన్ని తూటాలు కాల్చారు, ఏ ఆయుధంతో కాల్చారు? బ్యాలెస్టిక్ రిరేపోర్టులో తెలుస్తుంది అని కూడ అందరికీ తెలుసు.
ఇటీవల సుమారు 20, 30 సంవత్సరాల నుంచి అడవి, కొండలు, నదులు ఎక్కడెక్కడ ఖనిజాలు, అంటే బంగారం, వజ్రాలు, యురేనియం, గ్రానైట్ ఇతర అనేక ఖనిజాలు దొరికే ప్రాంతాల్లో ప్రభుత్వమూ, కార్పొరేట్ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటాయి. అక్కడ కొండ ప్రాంతాలు వుంటాయి. అక్కడ పక్షులు వుంటాయి, జంతువులు వుంటాయి, జింకలు వుంటాయి, పులులు వుంటాయి, చెట్లు వుంటాయి. ఆ చెట్లను నరికేస్తారు. చెట్లను నరికేస్తే పక్షులు చనిపోతాయి, జంతువులు కూడా చనిపోతాయి. అక్కడ వుండే ఆదివాసులు కూడా చనిపోతారు. నీళ్ళు పాడైపోతాయి, వాతావరణం కలుషితం అవుతుంది. పర్యావరణం నాశనం అవుతుంది. ఇలాంటి సందర్భంలో మొత్తం దేశం గురించి, సమాజం గురించి ఆందోళన చెందేవారు అక్కడికి వెళ్ళి ఆదివాసులతో కలిసి పోరాటం చేస్తారు. ఇలా పోరాటం చేసేవారిని పోలీసులు చంపేస్తారు.

ఛత్తీస్‌ఘడ్‌లో సల్వా జుడుమ్ అనే మాఫియా రౌడీ గుంపు ఎంతోమంది ఆదివాసులను చంపేసింది. ఇంకొక చోట కుక్క, తేలు, కోబ్రా అనే పేర్లతో కూడ ఆదివాసులను చంపడాన్ని మనం చూసాం. 2000 సంవత్సరంలో కుదురే దగ్గర అక్కడ వున్న కొండల్లో, కుదురేముఖ్ ఐరన్ ఓ‌ర్ కోసం కొండలను తవ్వి, చెట్లను నరికి, పరసరాల్ని నాశనం చేసి, అక్కడ వుండే ఆదివాసులను ఊరు నుంచి వెళ్లగొట్టడం మొదలుపెట్టినప్పుడు విక్రమ్ గౌడ అతని స్నేహితులు ఆదివాసుల పక్షాన నిలబడి, దేశం పక్షాన నిలబడి, దేశ పర్యావరణాన్ని కాపాడడానికి, కొండలను కాపాడడానికి పోరాటం చేశారు. అనే వార్తలు కూడా వినబడుతున్నాయి.
ఈ ఆదివాసులు, మూలవాసుల గురించి ఆందోళన చెందే వారు కొంత మంది మాత్రం అడవి ప్రాంతాలకు వెళ్తారు. నగరాల్లో వుండే మనం వెళ్ళం. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, పిజ్జా బర్గర్‌లు తింటూ, అమెరికా, జర్మనీ, జపాన్, క్రికెట్, సినిమా అంటూ జీవితాన్ని గడిపేస్తాం. కానీ వారు అడవులకు వెళ్తారు. ఆదివాసులతో కలిసి జీవిస్తారు. వారు ఏం తింటారో అదే తింటారు. మనుషుల్లాగా బతుకుతారు. అలాంటివాళ్లను హత్య చేశారు. అది వింటే మనస్సు పాడై పోతోంది. ఒక నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళాలి. డాక్టర్ల బృందం పోస్ట్ మార్టం జరపాలి. ఏ వైపు నుండి కాల్పులు జరిపారు. ఆ తూటా ఎవరిది? అది పోలీసుల తూటా 032mm లేదా 9mm? ఏ పిస్తోలు? ఏ తుపాకీ? ఏ ఎకె 47? ఎంత దూరం నుంచి? ఏ కోణం నుంచి కాల్చారు? ఇదంతా పరిశోధన చేయాలి.
ఒక వారం రోజుల ముందు విక్రమ గౌడను పట్టుకున్నారు అనే వార్త కూడా మీడియాలో వస్తోంది. వారి చేతిలో వున్న మొబైల్ టవర్ లొకేషన్, ఫోన్‌కు వచ్చిన, ఫోన్ నుంచి వెళ్ళిన కాల్ డేటా చూస్తే ఎక్కడ వున్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. అందువల్ల డిజిటల్ సాక్ష్యం, డి‌ఎన్‌ఎ సాక్ష్యం, ఫోరెన్సిక్ పరిశోధన జరపాల్సి వుంటుంది.
విక్రమ్ గౌడ శరీరం మీద ఎన్ని వేలు ముద్రలు వున్నాయి? అతన్ని చిత్ర హింసలు పెట్టారా?కొట్టారా? అన్నం తిన్నాడా? అతని కడుపులో ఏముండింది? ఇవన్నీ కూడా పరీక్షించాలి. అదే విధంగా కేరళలో రాజన్‌ను అరెస్టు చేసి, బూటకపు ఎన్‌కౌంటర్ చేసిన 20 సంవత్సరాల తరువాత అప్పుడు ఎస్‌పి గా వున్న అతనికి జీవిత కాల శిక్ష కూడా పడింది. ఇది హత్య అయితే కనక తప్పు.
తీవ్ర‌వాదులు తప్పు చేయవచ్చు. మీకు చట్టం వుంది, అధికారం వుంది. అరెస్టు చేసి, న్యాయస్థానంలో ప్రవేశపెట్టి వారికి శిక్ష వేయండి. ఎవరు తప్పు చేసినా జైలుకు వెళ్ళాలి. పోలీసులకు తుపాకినిచ్చింది రక్షించడానికి, చంపడానికి కాదు. పోలీసులు తుపాకీని ఎక్కడ ఉపయోగించాలి? సరిహద్దుల్లో ఉపయోగించాలి. ఇక్కడున్న పౌరుల మీద కాదు. ఇలా ఎన్నో సార్లు జరిగింది. నిజనిర్ధారణ జరగాలి. డాక్టర్ల బృందం పోస్ట్ మార్టం చేయాలి. నేరం జరిగిన స్థల రిపోర్టు తయారు చేయాలి. మొత్తం సాక్ష్య సేకరణ శాస్త్రీయంగా జరగాలి. దర్శన్ రంగస్వామినో, నారాయణ స్వామినో, అతన్ని చంపేసిన తరువాత మొత్తం శాస్త్రీయ పద్ధతిలో విచారణ జరిగింది. అదే పద్ధతిలో యిక్కడ కూడా జరగాలి. తప్పు చేసిన వారిని జైలుకు పంపించాల్సిందే.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad