చత్తీస్ గడ్ లోని ఆదీవాసీల సంఘ౦ ‘మూలవాసి బచావో మంచ్’ పై ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని రద్దు చేయాలని ‘ఫోరం అగేనెస్ట్ కార్పోరేటైజేషన్ అండ్ మిలటరైజేషన్’ (FACAM) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటన…
ఛత్తీస్గఢ్ ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ, 30 అక్టోబర్ 2024 నాటి సర్క్యులర్ ద్వారా మూలవాసీ బచావో మంచ్, చట్టవిరుద్ధమైన, అభివృద్ధి వ్యతిరేక సంస్థగా పేర్కొంటూ నిషేధించినట్లు మా దృష్టికి వచ్చింది. క్రూరమైన ఛత్తీస్గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ (CSPSA) సెక్షన్ 3 కింద నిషేధం విధించారు. నిషేధం విధించడానికి ఈ సర్క్యులర్ లో ఎటువంటి నిర్దిష్ట కారణాలను పేర్కొనలేదు.
మూలవాసీ బచావో మంచ్ , బస్తర్లోని ఆదివాసీ రైతులను కార్పొరేట్ శక్తులు చేస్తున్న దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక ప్రజాస్వామిక ప్రజాసంస్థ. 2021 మే 13వ తేదీ మధ్య రాత్రిపూట పారామిలటరీ శిబిరం ఏర్పాటు చేసిన తర్వాత ఆదివాసీ బచావో మంచ్ ఏర్పడింది మే 17, 2021న పారామిలటరీ శిబిరానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో నలుగురు ఆదివాసీలు పారామిలటరీ సిబ్బందిచే చంపబడ్డారు. అప్పటి నుండి, మూలవాసీ బచావ్ మంచ్ పనిచేస్తున్నది. పారామిలటరీకి వ్యతిరేకంగా బస్తర్లో సిల్గర్ తో సహా 30 వేరు వేరు చోట్ల నిరసనలు చేసింది. బస్తర్లో 3 సంవత్సరాలకు పైగా సైనిక శిబిరాలు, బూటకపు ఎన్కౌంటర్ హత్యలు, ఆదివాసీ రైతుల సామూహిక అరెస్టులు , ఏరియల్ బాంబు దాడులు జరుగుతున్నాయి.
ఆదీవాసీ కార్యకర్త, ఆదివాసీ నాయకురాలు సోని సోరి, ‘ఫోరం అగేనెస్ట్ కార్పోరేటైజేషన్ అండ్ మిలటరైజేషన్’ (FACAM)తో మాట్లాడుతూ, ”మూలవాసీ బచావో మంచ్ ను నిషేధించడానికి, కారణాలేంటి ? బస్తర్ ఆదివాసీలను బలవంతంగా తమ ఇళ్ళనుంచి ఖాళీ చేయించి పారదోలుతున్నది ఎవరు ? ఆదివాసీల డిమాండ్లను ప్రభుత్వం విని మైనింగ్ను ఆపివేస్తే, సిల్గర్లో సైనిక శిభిరాలు ఏర్పాటు చేసి నలుగురు ఆదివాసీలను చంపడం బదులు క్యాంపుల ఏర్పాటు చేయకుండా ఉంటే. మూలవాసీ బచావో మంచ్ అవసరం ఉండేది కాదు.” అని అన్నారు. మూల వాసీ బచావో మంచ్ (MBM)వంటి సంస్థల ప్రాముఖ్యతను, వాటిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆమె, ” MBMని రక్షించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బాస్టర్లోని ఆదివాసీల ప్రయోజనాల కోసం పోరాడుతున్న, జల్జంగల్-జమీన్ , ఉనికిని కాపాడటానికి పోరాడుతున్న ఏకైక ఆదివాసీల సామూహిక సంస్థ ఇది. ” ప్రతి ఒక్కరూ MBMకి సంఘీభావంగా నిలబడాలని, మైదానంలో సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించాలని, అలాగే కోర్టులో నిషేధం విధించిన ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేయాలని ఆమె నొక్కి చెప్పారు.
క్రూరమైన ఛత్తీస్గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ (CSPSA) ద్వారా ప్రజాస్వామ్య మాస్ ఆర్గనైజేషన్పై ఏకపక్ష నిషేధం విధించడం, అలాగే గత నెలల్లో తప్పుడు,కల్పిత కేసుల కింద సునీతా పొట్టం, సుర్జు టేకంతో సహా అనేకమంది దాని సభ్యుల సామూహిక అరెస్టులు చేస్తున్న ప్రభుత్వం మరో వైపు తాము శాంతికి కట్టుబడి ఉన్నామనే కబుర్లు చేప్తోంది.ఆదివాసీ రైతాంగానికి వ్యతిరేకంగా వారిపై దాడులు చేస్తూ, కార్పొరేట్ దోపిడీ, సైనికీకరణను కొనసాగిస్తూ , మూలవాసీ బచావో మంచ్ వంటి సంస్థలను నిషేధిస్తున్నది. నిరాయుధ ప్రజాస్వామ్య, ప్రజా ఉద్యమంతో కనీస చర్చలు కూడా చేయని ప్రభుత్వం సాయుధ మావోయిస్టులతో చర్చలు జరుపాతనని ప్రకటించడం హాస్యాస్పదం.
ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (FACAM)మూలవాసీ బచావో మంచ్ పై నిషేధాన్ని తీవ్రంగా ఖండిస్తోంది!
ఈ క్రింది వాటిని డిమాండ్ చేస్తోంది-
- మూలాస్ బచావో మంచ్ పై నిషేధాన్ని రద్దు చేయండి
- కల్పిత, తప్పుడు కేసుల్లో అరెస్టు చేసిన దాని సభ్యులందరినీ విడుదల చేయండి.
- వారి డిమాండ్లపై మూలవాసి బచావో మంచ్తో చర్చలు జరపండి.
ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించే వారందరూ మూలవాసీ బచావో మంచ్పై ఏకపక్ష నిషేధానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాలని, నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము.
*ఆపరేషన్ సమాధాన్, ప్రహార్ లను ఆపివేయాలి
*సూరజ్కుండ్ పథకాన్ని ఆపివేయాలి
ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (FACAM)