ప్రజాహక్కుల కార్యకర్త, పోరాట యోధుడు డాక్టర్ సాయిబాబాకు నివాళులు అర్పిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటన….
శనివారం రాత్రి రాత్రి నిమ్స్ హస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన పౌర హక్కుల నేత, ప్రజాస్వామిక వాది, రచయిత, మేధావి ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. సాయిబాబా నెలకొల్పిన ఆశయాలను, ఆదర్శాలను, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధు మిత్రులు తన వారసులుగా కొనసాగించాలని కోరుతున్నది.
పౌర హక్కులను పరి రక్షించడానికి ప్రజల తరుపున గొంతెత్తిన సాయిబాబాను బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రాజ్యమే పథకం ప్రకారం హత్య చేసింది.
సాయిబాబా డిల్లి ప్రొపెసర్ గా కొనసాగుతూ మలి దశ తెలంగాణ ఉద్యమానికి మార్గ నిర్ధేశం చేశాడు. 1997 డిసెంబర్ లో AIPRF ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ కొరకు రెండు రోజుల సదస్సు జరిగింది. ఈ సభలోనే వరంగల్ డిక్లరేషన్ జరిగింది. ఆ సదస్సుకు జీఎన్ సాయిబాబా నాయకత్వం వహించాడు. ఆల్ ఇండియా పీపుల్స్ రిసిస్టెన్స్ ఫోరం(ఏఐపిఆర్ఎఫ్) లో కొనసాగుతూ ప్రజల ప్రాధమిక హక్కుల పరి రక్షణకై పోరాడాడు. ఫోరం ఎగనెస్ట్ వార్ ఇన్ పీపుల్స్ వేధికలో క్రియాశీలంగా పని చేస్తూ, సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ల సంస్థల ప్రయోజనాల కోసం దేశ సంపదను, ప్రాకృతిక వనరులను కొల్లగొట్టడానికి దేశ ప్రజలపై, ప్రధానంగా ఆదివాసీ ప్రజలపై సల్వాజుడుం, గ్రీన్ హంట్ పేర్లతో సాగుతున్న ఫాశవిక దాడులను నిర్ధాక్షిణంగా ఖండించాడు. దేశంలో పాశవికంగా కొనసాగుతున్న రాజ్య హింసను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశాడు.
జాస్వామిక బద్ధంగా ప్రశ్నించడం, ప్రశ్నించే శక్తులను తయారు చేయడం నేరంగా భావించిన రాజ్యం కుట్ర పూరితంగా, మానవ హక్కులను ఉల్లంగిస్తూ పెగాసస్ వంటి మాల్వేర్స్ సాఫ్ట్ వేర్ల ద్వారా జీఎన్ సాయిబాబా కంప్యూటర్ లో చొరబడి అందులో మావోయిస్టు సాహిత్యాన్ని చొప్పించి మావోయిస్టులతో సంబంధాలు కలిగి వున్నాడని నిందారోపణ చేసి రాజ్యంగ విరుద్ధ చట్టాలను అక్రమంగా మోపారు. నిర్దోషిని, 90 శాతం అంగవైకల్యంతో కదలేని స్థితిలో వీల్ చైర్ లో ఒకరి మద్దతు లేకుండా తన పని తాను చేసుకోలేని స్థితోలో వున్న జీఎన్ సాయిబాబాను అన్యాయంగా పది సంవత్సారాలు ఒంటరి అండా సెల్ లో నిర్భంధించారు. తీవ్రమైన అనారోగ్యంతో,బాదపడుతున్నప్పటికీ జైల్ లో ఎలాంటి వైద్య సౌకర్యాలు అందకుండా చేశారు. చివరి దశలో నిర్ధోషిగా నిరూపించబడి విడుదల చేయాలని మహారాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆ తీర్పును సవాల్ చేస్తూ హిందుత్వ శక్తులు ఎన్ఐఏ ద్వారా తన విడుదలను అడ్డుకున్నాయి.
జైలులో దుర్భర పరిస్థితులను కల్పించి సాయిబాబా ఆరోగ్యాన్ని క్షిణించేలా చేశారు. మరణానికి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలే పూర్తి బాధ్యత వహించాలి.
జీఎన్ సాయిబాబా పది సంవత్సరాలు అండ సెల్ ఒంటరిగా దుర్భర జీవితాన్ని అనుభవించాడు. దృఢ ధీక్షతో చీకటి అమానవీయ చర్యలను ఎదుర్కొన్నాడు. ఫాసిస్టు పాలకులు ఎన్ని మానసిక చిత్రహింసలు పెట్టినప్పటికీ తాను ఏనాడు రాజీ పడలేదు. జైలులో ఖైదీల హక్కుల కోసం ధైర్యంగా పోరాడాడు. అత్యంత ధైర్యశాలి మొక్కవోని ధైర్యంతో రాజ్యాన్ని ప్రశ్నించిని ప్రజాస్వామిక వాదికి, బుద్ధి జీవికి, అంగవైకాల్యన్ని లెక్క చేయని నిస్వార్థ నిలబడిన ప్రజల పక్షపాతికి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర కమిటీ తలవంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది.
జగన్,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
